BCCI: ఆసియా క్రీడల్లో ఆ రెండు జట్లు పాల్గొంటాయి.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. చైనాలో జరగనున్న ఈ గేమ్స్లో క్రికెట్ను కూడా చూడనున్నారు. ఈ క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయి. ఆసియా క్రీడలకు తమ పురుషుల, మహిళల జట్లను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ముందుగా బోర్డు సిద్ధంగా లేకపోయినా ఇప్పుడు అంగీకరించడంతో.. ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ ఆడనుంది. అయితే ఈ గేమ్లలో భారత మహిళల జట్టు ఆడనుంది. మరోవైపు ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్కు ప్రధాన జట్టు సిద్ధమవుతున్నందున.. పురుషుల విభాగంలో భారత ‘బి’ జట్టు బరిలోకి దిగుతుంది. హాంగ్జౌలో జరిగే ఈ గేమ్ల కోసం బీసీసీఐ రెండు జట్ల పేర్లను సమర్పించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Read Also: Parshottam Rupala: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. కేంద్రమంత్రి రూపాల
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
మరోవైపు గతంలో బిజీ షెడ్యూల్ కారణంగా ఈ గేమ్లలో జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ నిరాకరించింది. ఈ గేమ్లకు తమ జట్టులో ఎవరినీ పంపబోమని బోర్డు స్పష్టంగా పేర్కొంది. ఎందుకంటే ఆసియా క్రీడల్లో పురుషుల జట్టు మ్యాచ్లు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్నాయి. మరోవైపు వన్డే ప్రపంచకప్ మ్యాచ్లు కూడా అప్పుడే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లవచ్చని బీసీసీఐ తెలిపింది. గతంలో రెండు సార్లు ఆసియా క్రీడల్లో క్రికెట్ భాగమైంది. 2010 మరియు 2014లో ఈ గేమ్లలో క్రికెట్ను చేర్చారు. అయితే భారత్ రెండుసార్లు ఈ గేమ్ లలో పాల్గొనలేదు. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో క్రికెట్ను చేర్చలేదు.
Read Also: Telangana Slang: మొన్న బాలయ్య, ఇప్పుడు చిరు.. తెలంగాణ యాసలో రచ్చ లేపుడే!
గతేడాది బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ను చేర్చారు. కానీ మహిళల క్రికెట్కు మాత్రమే చోటు దక్కింది. ఈ గేమ్లలో హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఉన్న జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. 1998లో కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్కు చోటు లభించింది. అప్పుడు భారత పురుషుల జట్టు అందులో పాల్గొంది.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!