BCCI: ఆసియా క్రీడల్లో ఆ రెండు జట్లు పాల్గొంటాయి.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. చైనాలో జరగనున్న ఈ గేమ్స్లో క్రికెట్ను కూడా చూడనున్నారు. ఈ క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయి. ఆసియా క్రీడలకు తమ పురుషుల, మహిళల జట్లను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ముందుగా బోర్డు సిద్ధంగా లేకపోయినా ఇప్పుడు అంగీకరించడంతో.. ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ ఆడనుంది. అయితే ఈ గేమ్లలో భారత మహిళల జట్టు ఆడనుంది. మరోవైపు ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్కు ప్రధాన జట్టు సిద్ధమవుతున్నందున.. పురుషుల విభాగంలో భారత ‘బి’ జట్టు బరిలోకి దిగుతుంది. హాంగ్జౌలో జరిగే ఈ గేమ్ల కోసం బీసీసీఐ రెండు జట్ల పేర్లను సమర్పించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Read Also: Parshottam Rupala: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. కేంద్రమంత్రి రూపాల
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
మరోవైపు గతంలో బిజీ షెడ్యూల్ కారణంగా ఈ గేమ్లలో జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ నిరాకరించింది. ఈ గేమ్లకు తమ జట్టులో ఎవరినీ పంపబోమని బోర్డు స్పష్టంగా పేర్కొంది. ఎందుకంటే ఆసియా క్రీడల్లో పురుషుల జట్టు మ్యాచ్లు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్నాయి. మరోవైపు వన్డే ప్రపంచకప్ మ్యాచ్లు కూడా అప్పుడే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లవచ్చని బీసీసీఐ తెలిపింది. గతంలో రెండు సార్లు ఆసియా క్రీడల్లో క్రికెట్ భాగమైంది. 2010 మరియు 2014లో ఈ గేమ్లలో క్రికెట్ను చేర్చారు. అయితే భారత్ రెండుసార్లు ఈ గేమ్ లలో పాల్గొనలేదు. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో క్రికెట్ను చేర్చలేదు.
Read Also: Telangana Slang: మొన్న బాలయ్య, ఇప్పుడు చిరు.. తెలంగాణ యాసలో రచ్చ లేపుడే!
గతేడాది బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ను చేర్చారు. కానీ మహిళల క్రికెట్కు మాత్రమే చోటు దక్కింది. ఈ గేమ్లలో హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఉన్న జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. 1998లో కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్కు చోటు లభించింది. అప్పుడు భారత పురుషుల జట్టు అందులో పాల్గొంది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!