Thiruchendur: విషాదం.. ఆలయంలో ఏనుగుకు పండ్లు తినిపిస్తుండగా దాడి, ఒకరి మృతి
- తమిళనాడు రాష్ట్రం తిరుచెందూర్లోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో విషాదం
- ఇద్దరిపై తన కొమ్ములతో దాడి చేసిన 25 ఏళ్ల దేవనై అనే ఆలయ ఏనుగు
- మహౌత్ ఉదయ కుమార్, బంధువు శిశుబాలన్ ఏనుగుకు పండ్లు తినిస్తుండగా దాడి
- ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహౌత్ ఉదయ కుమార్ బంధువు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాష్ట్రం తిరుచెందూర్లోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం 25 ఏళ్ల దేవనై అనే ఆలయ ఏనుగు తన కొమ్ముతో దాడి చేసి ఒకరిని చంపింది. ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు దాని షెడ్లో జరిగింది. మహౌత్ ఉదయ కుమార్, అతని బంధువు శిశుబాలన్ ఏనుగుకు పండ్లను తినిపిస్తుండగా ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోయి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. చికిత్స పొందుతూ మహౌత్ ఉదయ కుమార్ బంధువు మృతి చెందాడు.
Read Also: Pakistan: సోషల్ మీడియాలో పాక్ నటి ప్రైవేటు వీడియో లీక్.. ఖండించిన మథిర
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరుచెందూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆలయ నిర్వాహకులు కూడా ప్రదేశాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేసి తదుపరి చర్యలు తీసుకున్నారు. తిరుచెందూర్లోని మురుగన్ ఆలయంలో అంతర్భాగమైన దేవనై అనే ఏనుగు.. కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో ఉంటోంది. పండుగల సమయంలో ఈ ఏనుగును ఆభరణాలతో అలంకరించి పూజలు చేస్తారు.
Read Also: Reels: రైలు లోపల, ట్రాక్లపై రీల్స్ చేస్తే జైలుకే..! ఆదేశాలు జారీ
అయితే.. ఆలయ ఏనుగులు ఇలా దాడి చేయడం మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్లో కేరళలోని వైకోమ్లోని టీవీ పురం శ్రీరామ స్వామి ఆలయంలో జరిగిన వేడుకలో పుతుపల్లికి చెందిన మహౌత్ అరవింద్ అనే వ్యక్తి.. కుంజులక్ష్మి అనే ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే వైద్యసేవలు అందించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!