Spotless Face Tips: ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం కావాలంటే ఈ పద్ధతులను అనుసరిస్తే సరి
- ప్రస్తుత కాలంలో తినే తిండి వల్ల యువతలో అనేక మార్పులు
- యుక్త వయసులో వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు
- ఈ పద్ధతులను అనుసరిస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spotless Face Tips: ప్రస్తుత కాలంలో తినే తిండి వల్ల యువతలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువత తినే ఆహార పదార్థాలలో జంక్ ఫుడ్స్ వల్ల వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యుక్త వయసులో వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు జీవితాంతం అలాగే ఉంటాయి. అయితే, వాటిని ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలను వాడి వాటిని నివారించవచ్చు. మరి అవేంటో ఓసారి చూద్దామా.
Also Read: Curry Leaves: కరివేపాకే కదా అని తీసి పారేస్తున్నారా? బరువు తగ్గడానికి అది ఎలా సహాయపడుతుందంటే?
Also Read
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
ముఖంపై మచ్చలు తగ్గాలంటే నిమ్మరసం వాడాలి. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. దీని కోసం, నిమ్మరసంలో కొంత నీరు మిక్స్ చేసి, ఆపై దూది సహాయంతో మచ్చలపై రాయండి. ఇలా ఐదు నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. అలాగే ముఖంపై మొటిమలు, దద్దుర్లు, మచ్చలు వంటి అన్ని సమస్యలను తగ్గించడంలో కలబంద సహాయపడుతుంది. అలోవెరా చర్మాన్ని తేమగా, హైడ్రేట్ చేస్తుంది. మీరు అలోవెరా జెల్ను నేరుగా ముఖానికి రాసుకోవచ్చు. అరగంట తర్వాత, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.
Also Read: Vishwak Sen: పాపులర్ సింగర్ ను ‘వాడు’ అనేసి నాలుక కరుచుకున్న విశ్వక్
అలాగే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది ముఖంపై మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనె చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చక్కెర, తేనెతో మీ ముఖాన్ని స్క్రబ్ చేసి, ఆపై గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా చేయడంతో మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇకపోతే, ఓట్ మీల్ ఒక గొప్ప ఎక్స్ఫోలియేటర్, క్లెన్సర్. ఇది చర్మం నుండి అదనపు నూనెను తొలగించి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ముఖంపై మచ్చలను తగ్గించడానికి మీరు ఓట్ మీల్ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఓట్ మీల్ లో మజ్జిగ మిక్స్ చేసి ముఖానికి స్క్రబ్ చేయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఇంకా పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ముఖ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ముఖంపై మచ్చలను తగ్గించడానికి మీరు పెరుగును ఉపయోగించవచ్చు. పెరుగును ముఖానికి పట్టించి అరగంట తర్వాత మంచినీటితో కడిగేయాలి. ఇది మీ చర్మానికి మెరుపును తెస్తుంది. దాంతో మొటిమలు, మచ్చలను కూడా తొలగిస్తుంది.
తాజావార్తలు
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!