Formula E Race Case: కేటీఆర్ను విచారిస్తున్న ఈడీ.. వీటిపైనే ప్రశ్నలు!
- ఫార్ములా ఈ రేస్ కేసులో A-1గా కేటీఆర్
- ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
- కేటీఆర్ను అడుగుతున్న ప్రశ్నలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ఈడీ కార్యాలయంలో కేటీఆర్ను అధికారులు విచారిస్తున్నారు. గంట నుంచి విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కేటీఆర్ నుంచి కీలక సమాచారంను ఈడీ అధికారులు రాబడుతున్నారు. నిధుల బదలాయింపు పైనే ఈడీ ఫోకస్ పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లించారన్న దానిపైనే ఈడీ ప్రశ్నలు సంధిస్తోంది.
కేటీఆర్ ఆదేశాలతోనే ఎఫ్ఈఓకు నిధులు పంపామని అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలు ఇప్పటికే చెప్పారు. వారిపై ఎందుకు ఒత్తిడి తెచ్చారని కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని కేటీఆర్ నుంచి రాబడుతోంది. ఆరు ప్రశ్నలపైనే ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫెమా చట్టంను ఏ విధంగా ఉల్లంఘించారు, డబ్బును విదేశాలకు ఎలా తరలించారు అనే దానిపై ప్రధానంగా కేటీఆర్ను విచారిస్తున్నారు.
Also Read
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- 10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
Also Read: Jaipal Reddy: రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి: జీవన్ రెడ్డి
జనవరి 7న ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవాల్సి ఉంది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఆ తీర్పు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. దీంతో 16న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ తన నివాసం నుంచి కాకుండా.. ఫామ్ హౌస్ నుంచి విచారణకు వచ్చారని తెలుస్తోంది. విచారణ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈడీ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ వద్ద భారీ బందోబస్తు చేపట్టారు.
- Tags
- BRS
- ED
- Formula E Case
- ktr
- telangana
తాజావార్తలు
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
-
Yash Toxic: యష్కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
ట్రెండింగ్
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..