New Rules: మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. సామాన్యుల జేబుపై ప్రభావం!
- మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే
- ATM ఉపసంహరణ ఛార్జీల పెరుగుదల
- FD, సేవింగ్స్ ఖాతాలో మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటితో ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. మే 1 నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. బ్యాంకింగ్, ఏటీఎం ఇలా పలు వాటిల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతి నెలా మొదటి రోజున LPG గ్యాస్తో సహా పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది సామాన్యుడి జేబుపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. రేపటి నంచి ఏయే మార్పులు చోటుచేసుకోనున్నాయో ఇప్పుడు చూద్దాం.
Also Read:Pawan Kalyan: సింహాచలం ఘటన దురదృష్టకరం
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ATM ఉపసంహరణ ఛార్జీల పెరుగుదల
ఏటీఎంల నుంచి నగదు తీసుకోవడానికి ఇకపై వినియోగదారులు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. గతంలో ఈ ఛార్జీ రూ.21 ఉండగా, ఇప్పుడు దానిని రూ.23కి పెంచనున్నారు. ఈ కొత్త ఛార్జీ మే 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ మార్పును దేశ కేంద్ర బ్యాంకు RBI, NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంయుక్తంగా చేశాయి. ప్రస్తుతం, మెట్రో నగరాల్లో మూడు సార్లు నగదు ఉపసంహరణ ఉచితం. కానీ మీరు పరిమితి కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకుంటే రూ. 21 ఛార్జ్ చెల్లించాలి.
Also Read:OTT : ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి శ్రీ విష్ణు సినిమా
LPG గ్యాస్ పై ప్రభావం
ప్రతి నెలా దేశీయ గ్యాస్ నుంచి వాణిజ్య గ్యాస్ ధరలను గ్యాస్ ఏజెన్సీ సవరిస్తుంది. అంటే, 1వ తేదీన దాని ధరలో పెరుగుదల లేదా తగ్గుదల ఉంటుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఏప్రిల్లోనే ప్రభుత్వం అన్ని సిలిండర్ల ధరలను దాదాపు రూ.50 పెంచింది.
Also Read:Cyber Fraud : క్వికర్ క్విజ్.. నమ్మితే నిండా మునిగినట్టే.. లక్షన్నర కాజేసిన సైబర్ కేటుగాళ్లు..!
FD, సేవింగ్స్ ఖాతాలో మార్పు
ఈ ఏడాది వరుసగా రెండుసార్లు ఆర్బిఐ రెపో రేటును తగ్గించింది. దీని ప్రభావం బ్యాంకు వడ్డీ రేట్లలో FD ఖాతాల నుంచి రుణాల వరకు కనిపించింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను మార్చాయి. రాబోయే కాలంలో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను కూడా మార్చే అవకాశం ఉంది.
Also Read:Nagachithanya : నాగచైతన్య-శోభితపై ఆ రూమర్లు.. అంతా ఫేకేనా..?
స్థానిక బ్యాంకులో మార్పు
మే 1 నుంచి గ్రామీణ బ్యాంకులలో పెద్ద మార్పు రావచ్చు. ప్రతి రాష్ట్రంలోని అన్ని గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఒక పెద్ద బ్యాంకును సృష్టించే ప్రణాళిక ఉంది. ఈ పని ఒక రాష్ట్రం, ఒక RRB పథకం కింద జరుగుతుంది. ఈ మార్పు మొదట 11 రాష్ట్రాల్లో కనిపిస్తుంది. వీటిలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయి.
Also Read:Vijay Devarakonda : ఒకేసారి రెండు సినిమాలు.. విజయ్ ఏంటీ స్పీడు..
రైల్వేలలో ఏమి మారుతుంది?
మే 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్లో పెద్ద మార్పు రాబోతోంది. ఇప్పుడు ప్రయాణీకులు వెయిటింగ్ టిక్కెట్లపై స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణించలేరు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?