Facebook Fraud: కొంపముంచిన ఫేస్బుక్ చాటింగ్.. మొత్తం దోచేసిన కి’లేడీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మోసాలు చేయడం చాలా చూస్తున్నాం. ఎలాగోలా డబ్బులు సంపాదించేకునేందుకు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఓ యువకుడిని ఫేస్బుక్ మోసం చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఫేస్బుక్లో పరిచయమైన ఇద్దరు యువతులతో ఓ యువకుడు చాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఓ యువతి.. యువకుడిని ఫైవ్ స్టార్ హోటల్కు పిలిపించి అతని వద్ద ఉన్న వస్తువులన్నీ దోచుకుంది.
Ponguleti Srinivas Reddy: తెలంగాణలో అధికారం ఎవరబ్బా సోత్తు కాదు..
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసన్సోల్కు చెందిన ఓ యువకుడు ఫేస్బుక్లో ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని కలిశాడు. అయితే ఆ యువతి అతన్ని కోల్కతాకు రావాలని చెప్పింది. దీంతో కోల్కతా వచ్చిన యువకుడు.. న్యూ టౌన్లోని ఫైవ్ స్టార్ హోటల్లో ఉండాలని యువతి చెప్పింది. మొదట యువకుడు పార్క్ స్ట్రీట్లోని ఒక హోటల్లో ఉందామని అనగా.. దానికి యువతి అంగీకరించలేదు. ఆ తరువాత ఇద్దరూ న్యూటౌన్లోని ఫైవ్ స్టార్ హోటల్లో గదిని బుక్ చేసుకోవడానికి అంగీకరించారు.
Naveen Vijaya Krishna: విజయ నిర్మల పెద్ద మనవడు.. నరేష్ కొడుకు ఏంటి ఇలా మారిపోయాడు..?
జులై 26న న్యూటౌన్లోని హోటల్ లో యువకుడు ఓ రూమ్ బుక్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు యువతులు హోటల్ గదికి వచ్చారు. తర్వాత ఆహారం కోసమని.. ఓ యువతితో కలిసి బయటకు వెళ్లాడు. ఇంతలోనే రూమ్ లో ఉన్న మరో యువతి.. యువకుడు వచ్చే సరికి మద్యం సిద్ధం చేసింది. అయితే తాను తాగనని.. యువకుడు ఎంత చెప్పినప్పటికీ యువతి పదేపదే తాగాలని చెప్పింది. దీంతో చివరకు మద్యం సేవించాడు. ఆ తర్వాత స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అమ్మాయిలిద్దరూ యువకుడి వద్ద ఉన్న నెక్లెస్, ఉంగరం, 30 వేల రూపాయలతో అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తర్వాత మెలుకువ వచ్చి చూసేసరికి.. తాను మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
UP CM Yogi Adityanath: నేరస్థులకు ప్రభుత్వం హారతి పట్టదు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
వెంటనే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. హోటల్లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా సోమవారం తల్లిగంజ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లను పరిశీలించిన తర్వాత.. ఆ ఇద్దరు యువతులు ఇలా ఆన్ లైన్ లో యువకులను స్నేహితులుగా చేసుకుని మోసం చేస్తారని తేలింది. అంతేకాకుండా తమ ఫోన్లలో పలువురు యువకుల ఫోన్ నంబర్లు లభ్యమయ్యాయి. యువతులను అరెస్టు చేసిన పోలీసులు.. మంగళవారం బరాసత్ కోర్టులో హాజరుపరిచారు.
- Tags
- cheat
- national news
- stole
- Woman
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!