United Nations: బంగ్లాదేశ్ నిరసనల్లో 1400 మంది మృతి.. ఐక్యరాజ్యసమితి వెల్లడి..
- గత ఏడాది జూలై-ఆగస్టులో విద్యార్థుల నిరసనలు
- బంగ్లాదేశ్ లో భారీ హింస
- 1400 మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడి
గత ఏడాది జూలై-ఆగస్టులో విద్యార్థుల నిరసనలు, తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ దేశంలో భారీ హింసను చూసింది. బంగ్లాదేశ్లో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా వాజిద్కు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ చర్యలో కనీసం 1,400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం బుధవారం అంచనా వేసింది.
READ MORE: Anji Reddy Chinnamile : కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఓట్లు అడగాలి….
Also Read
- Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
- Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
- IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
గత సంవత్సరం జూలై 1 – ఆగస్టు 15 మధ్య జరిగిన నిరసనలలో 1,400 మందికి పైగా మరణించి ఉండవచ్చని మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. వేలాది మంది గాయపడ్డారని వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ భద్రతా దళాల కాల్పుల్లో మరణించారని స్పష్టం చేసింది. మరణించిన వారిలో 12 నుంచి 13% మంది పిల్లలే ఉన్నారని నివేదిక పేర్కొంది. ఇందులో 44 మంది అధికారులు కూడా మరణించారని బంగ్లాదేశ్ పోలీసులు చెబుతున్నారు. ఉన్నత భద్రతా అధికారుల సమన్వయంతో బంగ్లాదేశ్లో నిరసనలను అణిచివేసేందుకు చట్టవిరుద్ధ హత్యలు, విస్తృతమైన ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలు, హింసలు జరిగాయని మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ తెలిపారు.
READ MORE: PM Modi Plane Cost: ప్రధాని మోడీ ప్రయాణించే విమానం ధర ఎంతో తెలుసా?
బంగ్లాదేశ్లో దీర్ఘకాలంగా ప్రధాన మంత్రిగా ఉన్న షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఆమెపై తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ఈ సింహలో ఎంత మంది మరణించారు? అనే అంశాన్ని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ తెలుసుకునేందుకు.. ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ బృందాన్ని బంగ్లాదేశ్కు ఆహ్వానించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు కోటా వ్యవస్థను నిరసిస్తూ ఈ విద్యార్థి ఉద్యమం శాంతియుతంగా ప్రారంభమైందని.. క్రమంగా ఈ ఉద్యమం ఊహించని విధంగా షేక్ హసీనా, ఆమె పాలక అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటుగా మారిందని నివేదిక వెల్లడించింది.
తాజావార్తలు
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
-
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
-
IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?