Delhi: ఆన్లైన్ లోన్ యాప్లపై కేంద్రం కొరడా.. 87 యాప్లు బ్లాక్
- ఆన్లైన్ లోన్ యాప్లపై కేంద్రం కొరడా
- 87 యాప్లు బ్లాక్ చేసిన కేంద్రం
- పార్లమెంట్లో వెల్లడించిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి మనిషికి ఏదొక సమయంలో డబ్బు అవసరం ఉంటుంది. సమయానికి తెలిసిన వారు సాయం చేయకపోయినా.. బ్యాంక్లు రుణాలు ఇవ్వకపోయినా వెంటనే ఆన్లైన్ లోన్ యాప్లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని యాప్లు చట్టానికి లోబడి పని చేస్తుంటే.. మరికొన్ని యాప్లు అక్రమాలకు పాల్పడుతున్నాయి. మనుషుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ యాప్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఏది నిజమో.. కాదో తెలియక ప్రజలు మోసపోతున్నారు. కొన్ని ఆన్లైన్ యాప్లు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ యాప్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది.
ఇది కూడా చదవండి: Shah Rukh Khan: షారూఖ్ఖాన్ మార్కుల షీట్ వైరల్.. మ్యాథ్స్లో ఎన్ని మార్కులొచ్చాయంటే..!
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
దేశ వ్యాప్తంగా 87 అక్రమ రుణ యాప్లను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. ఆన్లైన్ రుణ కార్యకలాపాల్లో పాల్గొన్న కంపెనీలపై 2013 కంపెనీల చట్టం ప్రకారం విచారణలు, ఖాతాల తనిఖీలు, దర్యాప్తులతో సహా నియంత్రణ చర్యలు కాలానుగుణంగా నిర్వహించబడుతున్నాయని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: నేడు సిద్ధరామయ్యతో కేసీ.వేణుగోపాల్ కీలక భేటీ! పంచాయితీ తెగేనా?
డిసెంబర్ 1న లోక్సభలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రి దృష్టికి వచ్చిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2013 ప్రకారం ప్రభుత్వం ‘షెల్ కంపెనీలను’ నిర్వచించాలని యోచిస్తుందా? పనిచేయని సంస్థల పర్యవేక్షణను మెరుగుపరచడానికి, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నలో అడిగారు. దీనికి పైవిధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది.
ఉల్లంఘనలు జరిగినప్పుడల్లా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తనిఖీలు, సమ్మతి తనిఖీలు కొనసాగుతున్నాయని.. క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతున్నాయని సమాధానంలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..