Delhi: ఆన్లైన్ లోన్ యాప్లపై కేంద్రం కొరడా.. 87 యాప్లు బ్లాక్
- ఆన్లైన్ లోన్ యాప్లపై కేంద్రం కొరడా
- 87 యాప్లు బ్లాక్ చేసిన కేంద్రం
- పార్లమెంట్లో వెల్లడించిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి మనిషికి ఏదొక సమయంలో డబ్బు అవసరం ఉంటుంది. సమయానికి తెలిసిన వారు సాయం చేయకపోయినా.. బ్యాంక్లు రుణాలు ఇవ్వకపోయినా వెంటనే ఆన్లైన్ లోన్ యాప్లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని యాప్లు చట్టానికి లోబడి పని చేస్తుంటే.. మరికొన్ని యాప్లు అక్రమాలకు పాల్పడుతున్నాయి. మనుషుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ యాప్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఏది నిజమో.. కాదో తెలియక ప్రజలు మోసపోతున్నారు. కొన్ని ఆన్లైన్ యాప్లు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ యాప్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది.
ఇది కూడా చదవండి: Shah Rukh Khan: షారూఖ్ఖాన్ మార్కుల షీట్ వైరల్.. మ్యాథ్స్లో ఎన్ని మార్కులొచ్చాయంటే..!
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
దేశ వ్యాప్తంగా 87 అక్రమ రుణ యాప్లను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. ఆన్లైన్ రుణ కార్యకలాపాల్లో పాల్గొన్న కంపెనీలపై 2013 కంపెనీల చట్టం ప్రకారం విచారణలు, ఖాతాల తనిఖీలు, దర్యాప్తులతో సహా నియంత్రణ చర్యలు కాలానుగుణంగా నిర్వహించబడుతున్నాయని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: నేడు సిద్ధరామయ్యతో కేసీ.వేణుగోపాల్ కీలక భేటీ! పంచాయితీ తెగేనా?
డిసెంబర్ 1న లోక్సభలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రి దృష్టికి వచ్చిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2013 ప్రకారం ప్రభుత్వం ‘షెల్ కంపెనీలను’ నిర్వచించాలని యోచిస్తుందా? పనిచేయని సంస్థల పర్యవేక్షణను మెరుగుపరచడానికి, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నలో అడిగారు. దీనికి పైవిధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది.
ఉల్లంఘనలు జరిగినప్పుడల్లా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తనిఖీలు, సమ్మతి తనిఖీలు కొనసాగుతున్నాయని.. క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతున్నాయని సమాధానంలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!