యూపీ ప్రభుత్వం పై అత్యున్నత న్యాయస్థానం ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లఖింపూర్ ఖేరీ ఘటనలో యూపీ ప్రభుత్వం పై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హారీష్ సాల్వే 68 మంది సాక్షుల్లో 30 మంది వాంగ్మూలాలను రికార్డు చేసినట్లు తెలిపారు. దీన్లో 23 మంది తమను తాము ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్నట్టు తెలిపారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్రామన్ కశ్యప్, మరో మృతుడు శ్యామ్ సుందర్ మరణాలపై దర్యాప్తు వివరాలను వెల్లడించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
దీనికి సంబంధించిన నివేదికలను, వీడియోలను త్వరగా ఇవ్వాలని ఫోరెన్సిక్ విభాగాన్ని కోరింది. లఖింపూర్ ఘటనకు సంబంధించిన సాక్షులకు రక్షణ కల్పించాలని కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మిగిలిన సాక్షులు వాంగ్మూలాలను జుడీషీయల్ మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేయాలని హరీష్ సాల్వేను కోర్టు ఆదేశించింది. ప్రత్యక్ష సాక్షులు68 మందిలో కేవలం23 మందే ఉండటం పై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వందల మంది రైతులు ఘటన జరిగిన ప్రాంతంలో ఉంటే కేవలం23 మంది ఉండటం ఏంటని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అనంతరం కేసును నవంబర్ 8కి వాయిదా వేసింది.
Also Read
తాజావార్తలు
-
Ram Pothineni: ‘వీరా’ పాత్రలో రామ్.. హీరోయిన్పై ఆసక్తికర టాక్
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!