Manmohan Singh Memorial: మన్మోహన్ సింగ్ స్మారకంపై రాజకీయ రగడ..
- మన్మోహన్ సింగ్ స్మారక స్థలానికి సంబంధించి వివాదం
- బీజేపీపై కాంగ్రెస్, ఆప్ తీవ్ర ఆరోపణలు
- స్పందించిర బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలానికి సంబంధించి వివాదం ముదురుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశ్నను లేవనెత్తుతూ.. “ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు.. అన్ని విభేదాలు కూడా అతనితో అంతం కావాలి. కానీ ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియల్లో కూడా ఇలాగే చేసి ఉంటే మీకు ఎలా అనిపించేది? మన్మోహన్ సింగ్ స్మారకం కోసం ఇంకా స్థలం కేటాయించకపోవడం సరికాదన్నారు. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన ప్రశ్న కాదు. దేశ చరిత్రకు సంబంధించిన అంశం కదా?” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Tamil Nadu: అన్నా యూనివర్సిటీ ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్.. సిట్ ఏర్పాటు
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ఈ విషయంపై మనం మాట్లాడటం చాలా సిగ్గుచేటు. డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం రాజ్ఘాట్ కాంప్లెక్స్లో స్థలం ఇవ్వడానికి మీరు ఎందుకు సిద్ధంగా లేరని నేను ప్రధాని నరేంద్ర మోడీని అడగాలనుకుంటున్నాను. నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు చేసిన ఇతర మాజీ ప్రధానులు లేరా? ఈ సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి. ఈ డిమాండ్ కేవలం కాంగ్రెస్ ది మాత్రమే కాదు. మొత్తం దేశం, భారతీయ సమాజానికి చెందినది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించిన చోటే.. స్మారక చిహ్నం నిర్మించాలి.” అని డిమాండ్ చేశారు.
READ MORE: Harish Rao: మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు..
కాగా, కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడి చేసింది. కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఆరోపించారు.కాంగ్రెస్ ఎప్పుడూ గాంధీ కుటుంబానికి వెలుపల ఉన్న నాయకులను గౌరవించదని, కానీ మోడీ ప్రభుత్వం అన్ని పార్టీల నాయకులను గౌరవిస్తోందన్నారు.. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో ఫోన్లో మాట్లాడి స్మారక చిహ్నం కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని కోరారు. అనంతరం హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ అంశంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, అంత్యక్రియలకు సంబంధించిన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!