Nitish Kumar Reddy: చాలా టెన్షన్కు గురయ్యా.. సెంచరీ తర్వాత నితీష్ రెడ్డి తండ్రి భావోద్వేగం..
- టెస్టు క్రికెట్లో నితీష్ తొలి అడుగు
- భారత్కు ట్రబుల్షూటర్ పాత్ర
- సెంచరీపై స్పందించిన నితీష్ రెడ్డి తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్టు క్రికెట్లో తొలి అడుగు వేసిన నితీష్ కుమార్ రెడ్డి.. భారత్కు ‘ట్రబుల్షూటర్’ పాత్ర పోషించాడు. నాలుగో టెస్టు మూడో రోజు సెంచరీతో ఆస్ట్రేలియా విజయ ఆశలపై నీళ్లు చల్లాడు. నితీష్ చేసిన105 పరుగుల చేశాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట త్వరగా ముగిసింది. ఈ నేపథ్యంలో భారత్ తొమ్మిది వికెట్లకు 358 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 474 పరుగులు.. అంటే భారత్ ఇంకా 116 పరుగులు చేయాల్సి ఉంది.
నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సందర్భంగా ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ నితీష్ తండ్రి ముత్యాల రెడ్డితో సంభాషించాడు. ఈ సందర్భంగా ముత్యాల రెడ్డి మాట్లాడుతూ.. తమ కుటుంబానికి ఇదొక ప్రత్యేకమైన రోజని సంతోషం వ్యక్తం చేశారు. తమ జీవితంలో ఈ రోజును అస్సలు మరిచిపోలేమన్నారు. “నితీష్ 14 ఏళ్ల నుంచే క్రికెట్ ఆడుతున్నాడు. చాలా బాగా ఆడటం మొదలు పెట్టాడు. నా కుమారుడు చేసిన సెంచరీని ప్రత్యక్షంగా చూడటం మాటల్లో చెప్పలేపోతున్నాను. నితీష్ 99 పరుగుల చేసి క్రీజ్లో ఉన్నప్పుడు ఎంతో టెన్షన్ పడ్డాను. ఒక్క వికెట్ మాత్రమే మిగిలింది. సిరాజ్ కూడా బాగా ఆడాడు. ఎట్టకేలకు నా కుమారుడు సెంచరీ సాధించడం ఆనందంగా ఉంది’’ అని భావోద్వేగానికి గుయ్యారు.
Also Read
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
ఇదిలా ఉండగా.. భారత్ – ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో నాలుగో మ్యాచ్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతోంది. వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా మూడో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు అల్ అవుట్ అవ్వగా.. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి సెంచరీతో అదరగొట్టగా.. 10 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 105 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మరోవైపు మహ్మద్ సిరాజ్ క్రీజ్ లో ఉన్నాడు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు కంటే భారత్ ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది.
The Emotions of Nitish Kumar Reddy's family and they talking about his maiden Hundred. ❤️ (RevSportz).
– NKR, THE HERO OF INDIA. 🌟🇮🇳pic.twitter.com/uSznPAxkNL
— Tanuj Singh (@ImTanujSingh) December 28, 2024
తాజావార్తలు
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
-
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..