Mallikarjun Kharge: గ్యాస్ ధర తగ్గింపుపై విమర్శలు.. ఎన్నికల లాలీపాప్గా అభివర్ణించిన ఖర్గే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గించడంపై రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పార్టీ.. రక్షా బంధన్కు ముందు దేశంలోని సోదరీమణులకు ప్రధాని మోడీ ఇచ్చిన బహుమతి అని అటుండగా.. మరోవైపు కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష కూటమి ఎన్నికల బహుమతిగా విమర్శలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ఇది ఎన్నికల లాలీపాప్గా అభివర్ణించారు. అది ఇప్పట్లో పనికి రాదని అన్నారు. ఎప్పుడైతే బీజేపీకి ఓట్లు తగ్గుతాయో.. ఎన్నికల కానుకల పంపిణీ మొదలైందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్లో పేర్కొన్నారు. ఇది తల్లులు మరియు సోదరీమణుల కోసం చూపించే గుడ్విల్ అని ఆయన అన్నారు. గత 9 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1100కి పెంచిందని తెలిపారు. ద్రవ్యోల్బణం సామాన్యుడి జీవితాన్ని నాశనం చేస్తున్నప్పుడు, మీకు ఏ బహుమతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
Kalki 2898AD: బిగ్ బ్రేకింగ్.. కల్కి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి ..?
Also Read
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
200 రూపాయల సబ్సిడీ ఇచ్చి దేశంలోని కష్టాల్లో ఉన్న ప్రజల కోపాన్ని తగ్గించలేమన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని ఖర్గే సూచించారు. ఈసారి ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు బీజేపీకి మార్గాన్ని చూపడం ఒక్కటే ఆప్షన్గా ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో కేవలం రూ.500లకే పేదలకు సిలిండర్లు ఇవ్వబోతోందని.. ఇది రాజస్థాన్లో కూడా అమలు చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీని తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనను విపక్షాలు చూస్తున్నాయి. అయితే ఇది రక్షా బంధన్ నాడు దేశవ్యాప్తంగా ఉన్న తల్లులు, సోదరీమణులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన కానుక అని అధికార పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు చెబుతున్నారు.
Allu Arjun: బన్నీ ఫాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్.. ఇండియాలోనే తొలిసారిగా?
మరోవైపు ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 న ప్రతిపక్ష కూటమి (ఇండియా) యొక్క మూడవ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం ముంబైలో జరుగనుండగా.. ద్రవ్యోల్బణంతో సహా అనేక అంశాలపై వ్యూహరచనతో పాటు, కన్వీనర్ పేరును కూడా ప్రకటించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విపక్ష కూటమికి భయపడిపోయిందని, అందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
जब वोट लगे घटने, तो चुनावी तोहफ़े लगे बटने !
जनता की गाढ़ी कमाई लूटने वाली, निर्दयी मोदी सरकार, अब माताओं-बहनों से दिखावटी सद्भावना जता रही है।
साढ़े 9 सालों तक ₹400 का #LPG सिलेंडर, ₹1100 में बेच कर, आम आदमी की ज़िंदगी तबाह करते रहे, तब कोई “स्नेह भेंट” की याद क्यों नहीं…
— Mallikarjun Kharge (@kharge) August 29, 2023
- Tags
- bjp
- congress
- gas price
- Kharge
- opposition
తాజావార్తలు
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!