Manipur Violence: క్రిస్మస్ వేళ.. కాల్పులతో మరోసారి దద్దరిల్లిన మణిపూర్
- మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులు
- ఇంఫాల్కు ఆనుకుని ఉన్న జిల్లాల్లోని గ్రామాల్లో ఘటన
- మృతుల సంఖ్యపై తెలియని సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు ఆనుకుని ఉన్న కొండ జిల్లాలైన ఇంఫాల్ ఈస్ట్, కాంగ్పోక్పీ జిల్లాల మధ్య అంతర్ జిల్లా సరిహద్దులోని రెండు గ్రామాల్లో భారీ కాల్పులు జరిగినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య గురించి ఖచ్చితమైన సమాచారం అందలేదు. ఈ సంఘటన కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను ప్రభావిత గ్రామాలకు పంపారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
మరోవైపు.. చురచంద్పూర్ జిల్లాలో భద్రతా దళాలు వంతెన కింద నుంచి 3.6 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో ఇంఫాల్-చురచంద్పూర్ రహదారిలోని లీసాంగ్ గ్రామం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పేలుడు పదార్థాలతో పాటు.. డిటోనేటర్లు, కార్డ్టెక్స్, ఇతర వస్తువులను బృందం స్వాధీనం చేసుకుంది.
READ MORE: Gurugram: బాలిక ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు అపహరణ
ఇదిలా ఉండగా.. ఈశాన్య భారతానికి విలువైన ఆభరణంగా వాసికెక్కిన రాష్ట్రం మణిపుర్. చూడచక్కని ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఈ రాష్ట్రం ఇటీవల మళ్లీ అగ్నిగుండంగా మారింది. మైతేయి-కుకీ తెగల మధ్య ఘర్షణలతో ఏళ్లుగా అల్లకల్లోలంగా ఉన్న మణిపుర్లో హింస మరోసారి పెచ్చుమీరుతోంది. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లే లక్ష్యంగా అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఏకంగా ముఖ్యమంత్రి ఇంటిపై కూడా దాడికి యత్నించాయి. అప్పటి నుంచి వరసగా గృహ దహనాలు జరుగుతున్నాయి. కర్ఫ్యూ కొనసాగుతున్నా యథేచ్ఛగా దాడులు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..