Master Plan: మాస్టర్ ప్లాన్ ఉద్యమం ఉధృతం.. భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన జేఏసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Master Plan: కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాని డిమాండ్ చేస్తూ.. రైతులు ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేయాలని నిర్ణయించారు. కామారెడ్డి మున్సిపల్ పాలక వర్గం తమ పదవులకు రాజీనామా చేయాలని డెడ్ లైన్ పెట్టారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల విజ్ఞప్తికి.. బీజేపీ కౌన్సిలర్లు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్ల పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నెల 20న గంప ఇళ్లు ముట్టడించాలని రైతు జేఏసీ అత్యవసర సమావేశంలో తీర్మాణించారు. ఇండస్ట్రీయల్ జోన్ లో తన భూమి పోతుందని ఆవేదనతో.. మరో రైతు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం ఉద్రిక్తతకు దారితీస్తోంది.
Read Also: Sabitha Indra Reddy: బదిలీల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరుగవద్దు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
మాస్టర్ ప్లాన్ పై పాత రాజం పేటలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 9 విలీన గ్రామాల రైతులు పాల్గొన్నారు. సమావేశంలో భవిష్యత్ కార్యచరణ పై చర్చించిన రైతులు… ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈనెల 19 తేదీ వరకు మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ లో తీర్మానం చేయాలని ఈ మేరకు.. పాలకవర్గం పై ఒత్తిడి చేసేలా కార్యాచరణ రూపొందించారు. విలీన గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా.. బీజేపీ 2వ వార్డు కౌన్సిలర్ సుతారి రవి, 11వ వార్డు కౌన్సిలర్ కాసర్ల శ్రీనివాస్ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను రైతు జేఏసీకి అందజేశారు. అధికార పార్టీకి చెందిన మిగతా కౌన్సిలర్లు తమ పదవులకు 19తేదీ లోపు రాజీనామా చేయాలని లేని పక్షంలో 20న కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు రైతులు.
Read Also: Hotel Bill : లగ్జరీ హోటళ్లో దిగాడు.. లక్షల బిల్లు ఎగ్గొట్టాడు
మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా.. 45 రోజులుగా ఉద్యమం చేస్తున్న విలీన గ్రామాల రైతులు.. మున్సిపల్ పాలక వర్గం రాజీనామాలే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. రైతుల గుంట భూమి కూడా నష్టం కలిగించే ప్రసక్తే లేదనీ చెప్తున్న కలెక్టర్, కమిషనర్, MLA లు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 19 వ తేదీన మున్సిపల్ సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసి.. మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో.. అధికార పార్టీ కౌన్సిలర్లు అయోమయంలో పడ్డారు. మాస్టర్ ప్లాన్ తన భూమి పోతుందని ఆవేదనతో.. రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన మర్రి బాలకృష్ణ విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. బాధితున్ని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని రైతులు చెబుతున్నారు. నేడు ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించిన రైతులు.. 19న కౌన్సిలర్ల రాజీనామాకు ఒత్తిడి తేవాలని, 20న ఎమ్మెల్యే ఇళ్లు ముట్టడిస్తామని స్పష్టం చేశారు. 20 నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేసేలా కార్యచరణ ఉంటుందని సంకేతాలిచ్చారు. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండటంతో.. అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!