Chhattisgarh: ఫోన్ అధికంగా వాడుతున్న భార్య.. రెండో ఫ్లోర్ నుంచి తోసేసిన భర్త
- స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్న జనాలు
- సంసారాల్లో చిచ్చు పెడుతున్న స్మార్ట్ ఫోన్
- తాజాగా ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఘటన
- భర్యపై ఆగ్రహానికి గురై రెండో ఫ్లోర్ నుంచి తోసేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం అందరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి . వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తపై భార్య.. భార్యపై భర్త.. అనుమానాలు పెంచుకుంటున్నారు. కొందరైతే చంపేయడానికి కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో వెలుగులోకి వచ్చింది. తన భార్య మొబైల్ ఫోన్ అధికంగా వాడిందన్న కారణంతో భర్త ఆమెను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఆమె తీవ్రంగా గాయపడగా.. డీకేఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. వికాస్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
READ MORE: UP: స్నేహితురాలి బర్త్డే సెలబ్రేషన్లో క్లాస్మేట్స్ దుశ్చర్య.. దళిత టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
Also Read
- Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేస్.. కోహ్లీకి ఛాన్స్ లేనట్లే.. ముందంజలో కాటేరమ్మ పెద్ద కొడుకు..
- Supreme Court: VVPAT స్లిప్పులపై ‘టైమ్ స్టాంప్’.. సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.. ఏమన్నారంటే..
- Super Splendor: హీరో నుంచి కొత్త స్ల్పెండర్ బైక్ వచ్చేసింది.. అదరిపోయిన ఫీచర్స్.. తక్కువ ధరలోనే..
- Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ ఆల్టైమ్ ఐపీఎల్ రికార్డుకు ఎసరు.. గురి తప్పదంటున్న వైభవ్ సూర్యవంశీ..
సునీల్ అనే వ్యక్తి రాజధాని రాయ్పూర్లోని వికాస్ నగర్లో నివాసం ఉంటున్నాడు. పని నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు. తన భార్యను అన్నం పెట్టమని అడిగాడు. ఆమె పట్టించుకోకుండా మొబైల్ని చూస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే అలసి పోయిన సునీల్ ఆగ్రహం పెంచుకున్నాడు. భార్యను ఇంట్లో నుంచి రెండో అంతస్తు బాల్కనీలోకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కిందకు తోసేశాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు పోలీసులతో పాటు అంబులెన్స్కు సమాచారం అందించారు. మహిళను డీకేఎస్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హత్యాయత్నం సెక్షన్ల కింద భర్తపై గుధియారి పోలీసులు కేసు నమోదు చేశారు.
READ MORE: PM Modi: జనవరి 8న ఏపీకి ప్రధాని.. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు!
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ఏడేళ్ల బుడతడు.. ఫోన్ లేకుండా క్షణం ఉండలేకపోతున్నాడు. ఫోన్ లాక్కుంటే బూతులు తిడుతున్నాడు. ఫోన్ ఇచ్చేదాక నానా హంగామా చేస్తున్నాడు. తలను గోడకు బాదుకోవడం, తండ్రిని కొట్టడం, బిల్డింగ్పై నుంచి దూకుతానని బెదిరించడం వంటి వయసుకు మించిన చేష్టలను చూసి తండ్రికి భయం పట్టుకుంటుంది. ఇది పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా దర్శనమిస్తోంది.
తాజావార్తలు
-
దోశ.. పూరి.. మిల్లెట్ ఇడ్లీ.. బోండా.. ఇంటర్ విద్యార్థులకు జూన్ 12 నుంచి..
-
Megastar Chiranjeevi: రెండు రోజుల్లో రెండోసారి.. ఎగ్జిబిటర్లతో చిరంజీవి మీటింగ్! ‘పెద్ది’ విషయంలో కీలక నిర్ణయం..
-
Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేస్.. కోహ్లీకి ఛాన్స్ లేనట్లే.. ముందంజలో కాటేరమ్మ పెద్ద కొడుకు..
-
ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ‘Cockroach Janata Party’.. ఈసీకి అప్లికేషన్! అప్లై చేసింది ఎవరో తెలుసా?
-
Ebola: ఆఫ్రికాను దాటేసిన ఎబోలా..? భయం గుప్పిట్లో ప్రపంచ దేశాలు.!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!