Indore temple accident : ఇండోర్ ఆలయ ప్రమాదంలో 36కు చేరుకున్న మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గురువారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ బెలేశ్వర మహాదేవ్ ఝులేలాల్ ఆలయం మెట్లబావికప్పు బావిలో పడిపోయింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు అందుకలోకి పడిపోయారు. దీంతో నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 36 కు చేరింది. మరణించిన వారి డేడ్ బాడీలను రెస్య్కూ టీమ్ వెలికితీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతన్నాయి.
Also Read : Foreign currency: చెన్నై, కొచ్చి విమానాశ్రయాల్లో విదేశీ కరెన్సీ, బంగారం పట్టుకున్న అధికారులు
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్న ఆలయం ఇండోర్ లోని పటేల్ నగర్ ప్రాంతంలో ఉంది. అయితే ఈ ఘటనలో 50 మందికి పైగా చనిపోయి ఉంటారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఇండోర్ కలెక్టర్ ఇలియా రాజా టీ తెలిపారు. ఇప్పటికైతే 36 మంది చనిపోయారని తెలుస్తోందని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు మరణించినట్లు తెలుస్తోంది.
Also Read : Simhadri: రికార్డులు తిరగరాసిన సినిమా తిరిగొస్తుంది…
నిన్న అర్థరాత్రి నుంచి ఆర్మీ టీమ్ కూడా రెస్య్కూ ఆపరేషన్ కోసం పిలిపించారు. పగలు 11 మృతదేహాలను, అర్థరాత్రి వరకు 24 డేడ్ బాడీలను కొనుగొన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని .. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. కాగా.. మధ్యప్రదేశ్ సీఎం పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు.. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తోందని ప్రధాని చెప్పారు.
Also Read : Amritpal Singh : త్వరలోనే వస్తా.. అమృత్పాల్ సింగ్ మరో వీడియో
ఇదిలా ఉండగా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు 70 మంది ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆలయంలో హవన్ సందర్భంగా భక్తులు నేలపై కూర్చొని ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే వీరంతా కూర్చున్న నేల కింద ఒక బావాడి( మెట్లబావి ) ఉంది. ఈ సమయంలో మెట్లబావి సిమెంట్ సీల్ కూలిపోవడంతో భక్తులు బావిలో పడిపోయారు. అంతకు ముందు ఈ మెట్లావిపై స్లాబ్ లేదు.. ఇటీవల దానిని కాంక్రీట్ స్లాబ్ తో కప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో లోడ్ కారణంగా కాంక్రీట్ కూలిపోయిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!