Indore temple accident : ఇండోర్ ఆలయ ప్రమాదంలో 36కు చేరుకున్న మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గురువారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ బెలేశ్వర మహాదేవ్ ఝులేలాల్ ఆలయం మెట్లబావికప్పు బావిలో పడిపోయింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు అందుకలోకి పడిపోయారు. దీంతో నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 36 కు చేరింది. మరణించిన వారి డేడ్ బాడీలను రెస్య్కూ టీమ్ వెలికితీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతన్నాయి.
Also Read : Foreign currency: చెన్నై, కొచ్చి విమానాశ్రయాల్లో విదేశీ కరెన్సీ, బంగారం పట్టుకున్న అధికారులు
Also Read
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్న ఆలయం ఇండోర్ లోని పటేల్ నగర్ ప్రాంతంలో ఉంది. అయితే ఈ ఘటనలో 50 మందికి పైగా చనిపోయి ఉంటారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఇండోర్ కలెక్టర్ ఇలియా రాజా టీ తెలిపారు. ఇప్పటికైతే 36 మంది చనిపోయారని తెలుస్తోందని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు మరణించినట్లు తెలుస్తోంది.
Also Read : Simhadri: రికార్డులు తిరగరాసిన సినిమా తిరిగొస్తుంది…
నిన్న అర్థరాత్రి నుంచి ఆర్మీ టీమ్ కూడా రెస్య్కూ ఆపరేషన్ కోసం పిలిపించారు. పగలు 11 మృతదేహాలను, అర్థరాత్రి వరకు 24 డేడ్ బాడీలను కొనుగొన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని .. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. కాగా.. మధ్యప్రదేశ్ సీఎం పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు.. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తోందని ప్రధాని చెప్పారు.
Also Read : Amritpal Singh : త్వరలోనే వస్తా.. అమృత్పాల్ సింగ్ మరో వీడియో
ఇదిలా ఉండగా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు 70 మంది ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆలయంలో హవన్ సందర్భంగా భక్తులు నేలపై కూర్చొని ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే వీరంతా కూర్చున్న నేల కింద ఒక బావాడి( మెట్లబావి ) ఉంది. ఈ సమయంలో మెట్లబావి సిమెంట్ సీల్ కూలిపోవడంతో భక్తులు బావిలో పడిపోయారు. అంతకు ముందు ఈ మెట్లావిపై స్లాబ్ లేదు.. ఇటీవల దానిని కాంక్రీట్ స్లాబ్ తో కప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో లోడ్ కారణంగా కాంక్రీట్ కూలిపోయిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!