Andhra Pradesh: తగ్గని వరద తీవ్రత.. మూడురోజులుగా నిలిచిపోయిన దహన సంస్కారాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసిన వాగులు వంకలు పొంగి పొరుళుతున్నాయి. ఆగని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలని వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ధాటికి చెట్లు చేమలు నేలకూలాయి. ఇళ్లలోకి సైతం వరద నీరు చేరింది.
గతంలో కొన్ని అపార్ట్మెంట్ లలోకి వరద నీరు ప్రవేశించిన ఘటనలు కూడా చూసాం. రహదారులు దెబ్బతిన్నాయి. ఈ వర్షాలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆంధ్రాలోనూ ఇదే పరిస్థితి. తాజాగా ఓ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు మూడు రోజులు పట్టింది.
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
వివరాలలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరిలో ఏజెన్సీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ముంచింగిపుట్టు మండలం లక్ష్మిపురం పంచాయితీ తుమ్మిడి పుట్టుకి చెందిన బురిడీ బాను అనే గిరిజన బాలిక అనారోగ్యం తో మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమె మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించాల్సి ఉంది.
కానీ ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దహన సంస్కారాలు మూడు రోజులుగా నిలిచిపోయాయి. ఎంతకి వాగు ఉదృత తగ్గకపోయేసరికి ప్రమాదం అని తెలిసున్న బంధువులు అతి కష్టం పైన వాగుని ధాటి దహన సంస్కారాలు పూర్తి చేశారు. బాలిక చనిపోయిందని బాధలో ఉన్న కుటుంబ సభ్యులకి మరింత భాధను కలిగించేలా బాలిక దహన సంస్కారాలు మూడు రోజులు నిలిచిపోవడం చాలా బాధాకరం.
తాజావార్తలు
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!