Parliament: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రం..లోక్సభలో తీవ్ర గందరగోళం
- ఈ రోజు పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం
- లోక్ సభలో వక్ఫ్ చట్టం 1995ని సవరించడానికి వక్ఫ్ (సవరణ) బిల్లు
- ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న విపక్ష ఎంపీలు
- మతంలో జోక్యం చేసుకోవడమేనన్న స్పీ ఎంపీ మొహిబుల్లా
- సభ 2 గంటలకు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వక్ఫ్ చట్టం 1995ని సవరించడానికి వక్ఫ్ (సవరణ) బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, ఎస్పీ ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇది మన మతంలో జోక్యం చేసుకోవడమేనని ఎస్పీ ఎంపీ మొహిబుల్లా అన్నారు. దీంతో పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది.
READ MORE: Andhra Pradesh: పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్!
Also Read
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
వక్ఫ్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు – లాలన్ సింగ్
పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు కేంద్ర మంత్రి లాలన్ సింగ్ మద్దతు తెలిపారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని లాలన్ సింగ్ విపక్షాలపై ధీమా వ్యక్తం చేశారు. “ఏదైనా సంస్థ నిరంకుశంగా మారినప్పుడు.. దానిని నియంత్రించడానికి, పారదర్శకత కోసం ప్రభుత్వం చట్టాలను చేస్తుంది. వక్ఫ్ బోర్డులో పారదర్శకత ఉండాలి. పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకువచ్చాం.” అని స్పష్టం చేశారు.
READ MORE:Naga Chaitanya Engagement: ఇట్స్ అఫీషియల్.. శోభితతో నాగచైతన్య ఎంగేజ్మెంట్! నాగార్జున ట్వీట్ వైరల్
ఇది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన – కనిమొళి
ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి అన్నారు. “ఏ ఆలయ కమిటీలో హిందువేతర సభ్యుడు లేనప్పుడు వక్ఫ్లో ఎందుకు? ఈ బిల్లు ప్రత్యేకంగా సమానత్వం యొక్క చట్టాన్ని ఉల్లంఘించే మత సమూహాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ బిల్లు పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకం. ఈ దేశం వివిధ మతాలు, వివిధ భాషల ప్రజలు నివసించే లౌకిక దేశం.” అని పేర్కొన్నారు.
READ MORE:Naga Chaitanya Engagement: ఇట్స్ అఫీషియల్.. శోభితతో నాగచైతన్య ఎంగేజ్మెంట్! నాగార్జున ట్వీట్ వైరల్
వక్ఫ్ బిల్లు ప్రాథమిక హక్కులపై దాడి – వేణుగోపాల్
వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించడమేనని అన్నారు. “ఈ బిల్లు ప్రాథమిక హక్కులపై దాడి. అయోధ్యలోని ఆలయంలో హిందువేతరు ఎవరైనా ఉన్నారా? ఏ దేవాలయం కమిటీలో హిందువేతరునైనా ఉంచారా? అని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ కూడా మతపరమైన సంస్థేనని వేణుగోపాల్ అన్నారు. ఇది సమాజాన్ని విభజించే ప్రయత్నంలో భాగంగా జరుగుతోందని మండిపడ్డారు.
READ MORE:Pune : పుణెలో ఘోర ప్రమాదం.. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో గ్యాస్ లీక్
రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా..
రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత సభా కార్యక్రమాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?