Haryana: పెళ్లి జరిగిన మరుసటి రోజే వధువు పరారీ.. భర్తకు, అత్తకి టీలో మత్తు ఇచ్చి..
- హర్యానాలోని సోనిపట్లోని ఖర్ఖోడాలో ఆశ్చర్యకరమైన కేసు
- పెళ్లి జరిగిన మరుసటి రోజే వధువు పరారీ
- భర్తకు, అత్తకి టీలో మత్తు ఇచ్చిన నవ వధువు
- బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని సోనిపట్లోని ఖర్ఖోడాలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లి జరిగిన మరుసటి రోజే నవ వధువు పారిపోయింది. పెళ్లికూతురు అర్ధరాత్రి టీలో మత్తు మందు కలిపి అత్త, భర్తలకు తాగించింది. ఆ తర్వాత ఇద్దరు అపస్మారక స్థితిలోకి చేరగానే వధువు ఇంట్లోని బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనపై ఖార్ఖోడా పోలీసులు కేసు నమోదు చేశారు.
READ MORE: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత హెచ్1బీ వీసా గురించి భారతీయుల సెర్చ్..!
Also Read
- OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
పోలీసుల సమాచారం ప్రకారం… సోనిపట్లోని ఖర్ఖోడా గురుకుల వీధికి చెందిన ఓ యువకుడు హరిద్వార్కు చెందిన పల్లవిని నవంబర్ 13న వివాహం చేసుకున్నాడు. అదే సమయంలో దాదాపు 1.25 లక్షల రూపాయలను కూడా వధువు తరఫు వారికి అందించారు. వివాహం తర్వాత, యువకుడు నవంబర్ 14న ఖర్ఖోడా చేరుకున్నాడు. నవంబర్ 24న ఇక్కడ వివాహ రిసెప్షన్ నిర్వహించగా, నవంబర్ 15వ తేదీ రాత్రి నవ వధువు టీలో మత్తు మందు కలిపి భర్తకు, అత్తకి ఇచ్చింది. టీ తాగి వధువు భర్త, అత్త స్పృహతప్పి పడిపోయారు. ఇంతలో బంగారు నగలు, రూ.2 లక్షల నగదుతో వధువు పరారైంది. దీని తర్వాత, యువకుడు, అతని తల్లి ఖర్ఖోడా ఆసుపత్రిలో చేరారు. ఇంటికి చేరుకునే సరికి పరిస్థితి సద్దుమణిగేసరికి ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లో చాలా వస్తువులు కూడా పోయాయి. నవ వధువు తండ్రికి ఫోన్ చేయగా, వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఈ విషయంపై బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని కోరాడు.
తాజావార్తలు
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!