Terrorists Using China-Made Weapons: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల వద్ద చైనా ఆయుధాలు!
Terrorists Using China-Made Weapons: జమ్మూ కాశ్మీర్లో సైన్యంపై ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాల ప్రకారం.. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు సైన్యంపై దాడి చేయడానికి చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నాయి. పాకిస్థాన్ సైన్యానికి డ్రోన్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలను చైనా సరఫరా చేస్తోందని, వీటిని ఇటీవలి దాడుల్లో ఉగ్రవాద గ్రూపులు ఉపయోగించాయని, దానికి సంబంధించిన ఆధారాలు భద్రతా బలగాలకు దొరికాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జరిగిన మూడు ప్రధాన ఉగ్రదాడులు బంధాన్ని బయటపెట్టాయి.
Read Also: Prabhas: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టకు ‘ఆదిపురుష్’కి పిలుపు
Also Read
చొరబాటుదారుల వద్ద చైనీస్ ఆయుధాలు..
పాకిస్థాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు చైనా టెక్నాలజీతో తయారు చేసిన స్నిపర్ గన్లను భారత సైనికులపై వినియోగిస్తున్నట్లు తేలింది. నవంబర్లో జమ్మూ సరిహద్దులో భారత సైనికుడిపై స్నిపర్ తుపాకీని ఉపయోగించిన అటువంటి దాడి జరిగింది. ఈ ఏడాది జరిగిన మూడు అతిపెద్ద ఉగ్రదాడుల తర్వాత ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన చిత్రాలను చైనీస్ నిర్మిత బాడీ కెమెరాల నుంచి తీయడంతోపాటు వాటిని ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి. టెర్రరిస్టులు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ పరికరాలు కూడా చైనీస్వేనని నిఘా సంస్థలు తెలిపాయి. పాకిస్తాన్ సైన్యం క్రమం తప్పకుండా చైనా నుంచి ఆయుధాలు, కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాల సరఫరాలను అందుకుంటుంది. కానీ వాటిని ఉపయోగించకుండా భారతదేశంలో చొరబాట్లు, ఉగ్రవాద దాడుల కోసం వాటిని పీవోకేలోని ఉగ్రవాద సంస్థలకు అందుబాటులో ఉంచుతుంది.
Read Also: Farooq Abdullah: కశ్మీర్కు కూడా గాజాకు పట్టిన గతే పడుతుంది.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
భారత దళాలను మళ్లించడానికి చైనా బిడ్..
గల్వాన్లో 2020 సరిహద్దు స్టాండ్ఆఫ్ తరువాత లడఖ్లో భారత అధిక సైనిక ఉనికిని చూసి విసుగు చెందిన చైనా.. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. లడఖ్ సరిహద్దు నుంచి తిరిగి కాశ్మీర్కు సైన్యాన్ని తిరిగి మోహరించేలా భారత సైన్యాన్ని మళ్లించడానికి, ఒత్తిడి చేయడానికి చైనా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చైనా సహాయంతో పాకిస్తాన్ తన సైబర్ వింగ్ను బలోపేతం చేస్తోందని, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రహస్యంగా పర్యవేక్షించాలనుకుంటుందని సమాచారం. సైబర్ వార్ఫేర్ కోసం పాకిస్తాన్ కోసం ప్రత్యేక సమాచార భద్రతా ల్యాబ్ను ఏర్పాటు చేయడానికి చైనా నిధులు సమకూరుస్తోంది.
ఇటీవలి నెలల్లో, చైనా పాకిస్తాన్కు ఆధునిక, అత్యాధునిక ఆయుధాలను నిరంతరం సరఫరా చేస్తోంది. వీటిని తరచుగా జైషే మహమ్మద్, లష్కర్ ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం ద్వారా కాశ్మీర్లోని భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. అయితే, భారత భద్రతా వ్యవస్థ గత రెండేళ్లుగా చైనా ప్రయత్నాలను నిలకడగా అడ్డుకుంది. జమ్మూ, లడఖ్ సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనాలకు తగిన సమాధానం ఇస్తోంది. జమ్మూ కాశ్మీర్లో తాజా ఉగ్రదాడిలో, జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ సాయుధ ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు.ఉగ్రదాడి దృష్ట్యా, జమ్మూ కాశ్మీర్లోని పూంచ్-రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు సైన్యం మరిన్ని బలగాలను రప్పించేందుకు సిద్ధమైందని వర్గాలు తెలిపాయి. దళాల బలాన్ని పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్ను పటిష్టం చేయాలనే ప్రణాళిక ఉంది.
తాజావార్తలు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!