Farooq Abdullah: కశ్మీర్కు కూడా గాజాకు పట్టిన గతే పడుతుంది.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే, గాజా, పాలస్తీనాకు ఎదురైన గతినే కాశ్మీర్ ఎదుర్కొంటుందని అన్నారు. పూంచ్లో ఉగ్రవాదుల దాడిలో 5 మంది ఆర్మీ జవాన్లు మరణించి, మరుసటి రోజు ముగ్గురు పౌరులు మరణించిన కొద్ది రోజుల తర్వాత ఫరూక్ అబ్దుల్లా దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు. “మనం చర్చల ద్వారా పరిష్కారం కనుగొనకపోతే, ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేస్తున్న గాజా, పాలస్తీనాల మాదిరిగానే మనం కూడా అదే విధిని ఎదుర్కొంటాము” అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
Read Also: Saveera Parkash: పాకిస్థాన్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ ? ఇంతకీ సవీర్ ప్రకాష్ ఎవరు?
Also Read
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
కాశ్మీర్పై దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వైఖరిని ఉద్దేశిస్తూ ఫరూక్ అబ్దుల్లా ఇలా అన్నారు. ”మిత్రులను మార్చుకోగలం కానీ పొరుగువారిని మార్చుకోలేమని అటల్ బిహారీ వాజ్పేయి తరచు చెప్పేవారు. పొరుగువారితో మనం స్నేహంతో ఉంటే ఇద్దరూ ప్రగతి సాధించవచ్చు. యుద్ధం ఒక్కటే మార్గం కాదని, చర్చలు ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మోదీ అంటున్నారు. మరి చర్చలు ఎక్కడ? నవాజ్ షరీప్ ప్రధానిగా పగ్గాలు చేపడుతున్న తరుణంలో కూడా చర్చలకు (ఇండియాతో) సిద్ధమని ప్రకటించారు. కానీ మనం చర్చలు జరపకపోవడానికి కారణం ఏమిటి? చర్చల ద్వారా మనం పరిష్కారం కనుగొనలేకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే మనకూ ఎదురుకావచ్చు” అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
కాగా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలను సందర్శించి, ఉగ్రవాదులకు రహస్య ప్రదేశాలుగా ఉపయోగిస్తున్న గుహలను కూల్చివేయాలని స్థానిక సైనికులను కోరారు. ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఇంతలో, రాజౌరీ-పూంచ్లో వైమానిక నిఘా, కూంబింగ్ కార్యకలాపాలు, ముఖ్యంగా డేరా కి గలీ, బఫ్లియాజ్ అటవీ ప్రాంతంలో మంగళవారం 7వ రోజుకి చేరుకోవడంతో మొబైల్ ఇంటర్నెట్ సేవలు వరుసగా నాల్గవ రోజు మూసివేయబడ్డాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం రాజౌరీ-పూంచ్ సెక్టార్ను సందర్శిస్తారని, అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో విధుల్లో ఉన్న సైనికులతో సంభాషిస్తారని, ఈ ప్రాంతంలో ఉగ్రవాద దాడుల తరువాత ఇప్పటికీ పోరాడుతున్న పౌరులతో సమావేశమవుతారని పలు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!