Farooq Abdullah: కశ్మీర్కు కూడా గాజాకు పట్టిన గతే పడుతుంది.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే, గాజా, పాలస్తీనాకు ఎదురైన గతినే కాశ్మీర్ ఎదుర్కొంటుందని అన్నారు. పూంచ్లో ఉగ్రవాదుల దాడిలో 5 మంది ఆర్మీ జవాన్లు మరణించి, మరుసటి రోజు ముగ్గురు పౌరులు మరణించిన కొద్ది రోజుల తర్వాత ఫరూక్ అబ్దుల్లా దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు. “మనం చర్చల ద్వారా పరిష్కారం కనుగొనకపోతే, ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేస్తున్న గాజా, పాలస్తీనాల మాదిరిగానే మనం కూడా అదే విధిని ఎదుర్కొంటాము” అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
Read Also: Saveera Parkash: పాకిస్థాన్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ ? ఇంతకీ సవీర్ ప్రకాష్ ఎవరు?
Also Read
కాశ్మీర్పై దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వైఖరిని ఉద్దేశిస్తూ ఫరూక్ అబ్దుల్లా ఇలా అన్నారు. ”మిత్రులను మార్చుకోగలం కానీ పొరుగువారిని మార్చుకోలేమని అటల్ బిహారీ వాజ్పేయి తరచు చెప్పేవారు. పొరుగువారితో మనం స్నేహంతో ఉంటే ఇద్దరూ ప్రగతి సాధించవచ్చు. యుద్ధం ఒక్కటే మార్గం కాదని, చర్చలు ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మోదీ అంటున్నారు. మరి చర్చలు ఎక్కడ? నవాజ్ షరీప్ ప్రధానిగా పగ్గాలు చేపడుతున్న తరుణంలో కూడా చర్చలకు (ఇండియాతో) సిద్ధమని ప్రకటించారు. కానీ మనం చర్చలు జరపకపోవడానికి కారణం ఏమిటి? చర్చల ద్వారా మనం పరిష్కారం కనుగొనలేకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే మనకూ ఎదురుకావచ్చు” అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
కాగా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలను సందర్శించి, ఉగ్రవాదులకు రహస్య ప్రదేశాలుగా ఉపయోగిస్తున్న గుహలను కూల్చివేయాలని స్థానిక సైనికులను కోరారు. ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఇంతలో, రాజౌరీ-పూంచ్లో వైమానిక నిఘా, కూంబింగ్ కార్యకలాపాలు, ముఖ్యంగా డేరా కి గలీ, బఫ్లియాజ్ అటవీ ప్రాంతంలో మంగళవారం 7వ రోజుకి చేరుకోవడంతో మొబైల్ ఇంటర్నెట్ సేవలు వరుసగా నాల్గవ రోజు మూసివేయబడ్డాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం రాజౌరీ-పూంచ్ సెక్టార్ను సందర్శిస్తారని, అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో విధుల్లో ఉన్న సైనికులతో సంభాషిస్తారని, ఈ ప్రాంతంలో ఉగ్రవాద దాడుల తరువాత ఇప్పటికీ పోరాడుతున్న పౌరులతో సమావేశమవుతారని పలు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!