Farooq Abdullah: కశ్మీర్కు కూడా గాజాకు పట్టిన గతే పడుతుంది.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే, గాజా, పాలస్తీనాకు ఎదురైన గతినే కాశ్మీర్ ఎదుర్కొంటుందని అన్నారు. పూంచ్లో ఉగ్రవాదుల దాడిలో 5 మంది ఆర్మీ జవాన్లు మరణించి, మరుసటి రోజు ముగ్గురు పౌరులు మరణించిన కొద్ది రోజుల తర్వాత ఫరూక్ అబ్దుల్లా దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు. “మనం చర్చల ద్వారా పరిష్కారం కనుగొనకపోతే, ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేస్తున్న గాజా, పాలస్తీనాల మాదిరిగానే మనం కూడా అదే విధిని ఎదుర్కొంటాము” అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
Read Also: Saveera Parkash: పాకిస్థాన్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ ? ఇంతకీ సవీర్ ప్రకాష్ ఎవరు?
Also Read
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
కాశ్మీర్పై దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వైఖరిని ఉద్దేశిస్తూ ఫరూక్ అబ్దుల్లా ఇలా అన్నారు. ”మిత్రులను మార్చుకోగలం కానీ పొరుగువారిని మార్చుకోలేమని అటల్ బిహారీ వాజ్పేయి తరచు చెప్పేవారు. పొరుగువారితో మనం స్నేహంతో ఉంటే ఇద్దరూ ప్రగతి సాధించవచ్చు. యుద్ధం ఒక్కటే మార్గం కాదని, చర్చలు ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మోదీ అంటున్నారు. మరి చర్చలు ఎక్కడ? నవాజ్ షరీప్ ప్రధానిగా పగ్గాలు చేపడుతున్న తరుణంలో కూడా చర్చలకు (ఇండియాతో) సిద్ధమని ప్రకటించారు. కానీ మనం చర్చలు జరపకపోవడానికి కారణం ఏమిటి? చర్చల ద్వారా మనం పరిష్కారం కనుగొనలేకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే మనకూ ఎదురుకావచ్చు” అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
కాగా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలను సందర్శించి, ఉగ్రవాదులకు రహస్య ప్రదేశాలుగా ఉపయోగిస్తున్న గుహలను కూల్చివేయాలని స్థానిక సైనికులను కోరారు. ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఇంతలో, రాజౌరీ-పూంచ్లో వైమానిక నిఘా, కూంబింగ్ కార్యకలాపాలు, ముఖ్యంగా డేరా కి గలీ, బఫ్లియాజ్ అటవీ ప్రాంతంలో మంగళవారం 7వ రోజుకి చేరుకోవడంతో మొబైల్ ఇంటర్నెట్ సేవలు వరుసగా నాల్గవ రోజు మూసివేయబడ్డాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం రాజౌరీ-పూంచ్ సెక్టార్ను సందర్శిస్తారని, అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో విధుల్లో ఉన్న సైనికులతో సంభాషిస్తారని, ఈ ప్రాంతంలో ఉగ్రవాద దాడుల తరువాత ఇప్పటికీ పోరాడుతున్న పౌరులతో సమావేశమవుతారని పలు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
-
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!