Farooq Abdullah: కశ్మీర్కు కూడా గాజాకు పట్టిన గతే పడుతుంది.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే, గాజా, పాలస్తీనాకు ఎదురైన గతినే కాశ్మీర్ ఎదుర్కొంటుందని అన్నారు. పూంచ్లో ఉగ్రవాదుల దాడిలో 5 మంది ఆర్మీ జవాన్లు మరణించి, మరుసటి రోజు ముగ్గురు పౌరులు మరణించిన కొద్ది రోజుల తర్వాత ఫరూక్ అబ్దుల్లా దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు. “మనం చర్చల ద్వారా పరిష్కారం కనుగొనకపోతే, ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేస్తున్న గాజా, పాలస్తీనాల మాదిరిగానే మనం కూడా అదే విధిని ఎదుర్కొంటాము” అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
Read Also: Saveera Parkash: పాకిస్థాన్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ ? ఇంతకీ సవీర్ ప్రకాష్ ఎవరు?
Also Read
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
కాశ్మీర్పై దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వైఖరిని ఉద్దేశిస్తూ ఫరూక్ అబ్దుల్లా ఇలా అన్నారు. ”మిత్రులను మార్చుకోగలం కానీ పొరుగువారిని మార్చుకోలేమని అటల్ బిహారీ వాజ్పేయి తరచు చెప్పేవారు. పొరుగువారితో మనం స్నేహంతో ఉంటే ఇద్దరూ ప్రగతి సాధించవచ్చు. యుద్ధం ఒక్కటే మార్గం కాదని, చర్చలు ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మోదీ అంటున్నారు. మరి చర్చలు ఎక్కడ? నవాజ్ షరీప్ ప్రధానిగా పగ్గాలు చేపడుతున్న తరుణంలో కూడా చర్చలకు (ఇండియాతో) సిద్ధమని ప్రకటించారు. కానీ మనం చర్చలు జరపకపోవడానికి కారణం ఏమిటి? చర్చల ద్వారా మనం పరిష్కారం కనుగొనలేకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే మనకూ ఎదురుకావచ్చు” అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
కాగా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలను సందర్శించి, ఉగ్రవాదులకు రహస్య ప్రదేశాలుగా ఉపయోగిస్తున్న గుహలను కూల్చివేయాలని స్థానిక సైనికులను కోరారు. ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఇంతలో, రాజౌరీ-పూంచ్లో వైమానిక నిఘా, కూంబింగ్ కార్యకలాపాలు, ముఖ్యంగా డేరా కి గలీ, బఫ్లియాజ్ అటవీ ప్రాంతంలో మంగళవారం 7వ రోజుకి చేరుకోవడంతో మొబైల్ ఇంటర్నెట్ సేవలు వరుసగా నాల్గవ రోజు మూసివేయబడ్డాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం రాజౌరీ-పూంచ్ సెక్టార్ను సందర్శిస్తారని, అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో విధుల్లో ఉన్న సైనికులతో సంభాషిస్తారని, ఈ ప్రాంతంలో ఉగ్రవాద దాడుల తరువాత ఇప్పటికీ పోరాడుతున్న పౌరులతో సమావేశమవుతారని పలు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!