Schools Reopen : వేసవి సెలవులకు గుడ్బై.. పండుగ వాతావరణంలో స్కూల్స్ రీఓపెన్
- జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభం
- ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు తక్కువగా ఉండటం ఆందోళనకరం
- పాఠశాలలు విద్యార్థులకు పండుగలా స్వాగతం చెప్పేందుకు సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Schools Reopen : వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థుల బడిబాట ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. జూన్ 12న ఉదయం 9 గంటలకు తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ పాఠశాలలు పునఃప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. పిల్లలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఉపాధ్యాయులు స్కూల్స్ను పండుగ వాతావరణంగా తీర్చిదిద్దుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 26,067 ప్రభుత్వ పాఠశాలలు, 11,650 ప్రైవేటు పాఠశాలలు, 495 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. విద్యాశాఖ ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని జూన్ 6 నుంచి ప్రారంభించింది. అయితే కొత్త విద్యాసంవత్సరం మొదలవుతున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
Also Read
- T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
- Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
- Putin: పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
- T20 World Cup: 'కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి'.. భావోద్వేగానికి గురైన ఇండియన్ ప్లేయర్..
Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య కేసులో కుట్రదారుడు అక్తర్ అరెస్ట్
ప్రైవేట్ పాఠశాలలకే ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తుండడంతో, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల కొరతను ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది 1,25,000 మంది ఫస్ట్ క్లాస్ విద్యార్థులలో కేవలం 27,000 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, మిగిలిన వారు ప్రైవేట్ స్కూల్స్లో చేరారు. గతేడాది 1,990 ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల చేర్పు లేక మూతపడ్డాయి.
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు ముందుగానే చేరుకున్నాయి. కానీ యూనిఫాంల విషయంలో ఇంకా సమస్యలు కొనసాగుతున్నాయి. కొన్ని స్కూల్స్కు ఒక జత యూనిఫాంలు మాత్రమే అందాయి, మరికొన్నింటికి ఇంకా రాలేదు. ఉపాధ్యాయుల అభిప్రాయం ప్రకారం, సకాలంలో అన్ని సదుపాయాలు అందితే ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యకు గండికాదని స్పష్టం చేస్తున్నారు.
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే పాత సమస్యలు తలెత్తుతున్నా, వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ చెబుతోంది. విద్యార్థుల హాజరుతోనే ప్రభుత్వ బడుల భవిష్యత్ దాగి ఉంది. మరి ఈసారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Buchi Babu: ‘ఈ జన్మకి ఇది చాలురా’.. స్టేజ్పైనే కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు!
-
T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
-
Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
-
TIMS Jobs : టిమ్స్ సనత్నగర్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 3 నోటిఫికేషన్లు విడుదల
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?