Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య కేసులో కుట్రదారుడు అక్తర్ అరెస్ట్
- బాబా సిద్ధిక్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
- జీషాన్ అక్తర్ కెనడాలో అరెస్ట్
- భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు
ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్యకేసులో కుట్రదారుడు జీషాన్ అక్తర్ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. అక్తర్ను తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ 2024 అక్టోబర్ 12న బాంద్రా ప్రాంతంలో హత్యకు గురయ్యారు. కార్యాలయంలో ఉండగా దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ హత్య జరగడంతో దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ హత్య కేసులో కుట్రదారుడైన జీషన్ అక్తర్ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. నకిలీ పాస్పోర్ట్ కేసులో జీషాన్ అక్తర్ (22)ను అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: US: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసే ఛాన్స్.. అమెరికా హై అలర్ట్
Also Read
- Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
- Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
- 2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
జీషన్ అక్తర్ను భారత్కు తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు మహారాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ బుధవారం తెలిపారు. అనంతరం అతన్ని విచారిస్తామని పేర్కొన్నారు. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్.. బాబా సిద్ధిఖీని హత్య చేసేందుకు జీషన్ అక్తర్, శుభం లోంకర్లకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Thammudu : ఇదేంటి దిల్ రాజు ఇలా ఓపెన్ అయ్యాడు?
బాబు సిద్ధిఖీ హత్య కేసులో అరెస్టైన నిందితులను విచారించగా జీషాన్ అక్తర్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు ప్రణాళిక వేసింది జీషానేనని వెల్లడించారు. హత్య జరిగిన వెంటనే నకిలీ పాస్పోర్టును వినియోగించి దేశం విడిచి పారిపోయాడు. దీంతో జీషాన్పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో అతడు కెనడాలో అరెస్ట్ అయ్యాడు.
జీషాన్ అసలు పేరు మొహమ్మద్ యాసిన్ అక్తర్.. పంజాబ్లోని జలంధర్ వాసి. 2022లో పంజాబ్ పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సన్నిహిత సంబంధాలున్నాయి. 2024, అక్టోబర్ 12న బాబా సిద్ధిఖీ ముంబైలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
-
CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?