Bandi Ramesh: గడీల మధ్య తెలంగాణ బందీ అయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kukatpally Congress Candidate Bandi Ramesh Slams BRS Govt: గడీల మధ్య తెలంగాణ బందీ అయిందని, ఒక హోం మంత్రికి గెటు లోపలికి కూడా అనుమతి ఉండదని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ విమర్శించారు. ఉద్యమకారులను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు అని మోసం చేశారని మండిపడ్డారు. సూటు కేసుల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. పార్టీ లైన్ కోసం, ప్రజల కోసం తాను వచ్చానని బండి రమేష్ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన బండి.. తాను ఎదిగిన చోట ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి.. ఆపై టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులలో కొనసాగారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లిలో బండి రమేష్ మాట్లాడుతూ… ‘కూకట్ పల్లి నియోజక వర్గంకు అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకి ధన్యవాదాలు. వెంగళరావు వెళ్ళాడని నేను అనుకోవడం లేదు. అయన బాధ, అవేదన తెలిసిన వ్యక్తిని నేను. సూటు కేసులుతో రాజకీయాల్లోకి రాలేదు… పార్టీ లైన్ కోసం, ప్రజల కోసం పని చేసిన వ్యక్తిని నేను. కేసీఆర్ అడుగు జాడల్లో ఏ పని ఇచ్చినా గెలిపించిన చరిత్ర నాది. ఇన్నాళ్లు పార్టీలకి సేవ చేశా.. ఇక ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మెట్టమెదట ఇఇచ్చిన మాట తప్పారు. తెలంగాణ ఇచ్చాక కాంగ్రెస్ పార్టీలో విలీనం ఆన్నారు, దళిత ముఖ్యమంత్రి ఆన్నారు కానీ ఎది చేయలేదు’ అని అన్నారు.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
Also Read: Puneeth Rajkumar: ప్రజల మనస్సులో నిలిచి మరణాన్ని జయించిన పునీత్ రాజ్ కుమార్..
‘పైపై మెరుగులు దిద్దడం డెవలప్ కాదు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజుల్లోనే ఫ్లై ఓవర్లు కట్టారు. డ్యాంములు కట్టింది కాంగ్రెస్ అయంలోనే. ఉన్న రోడ్లు మాత్రమే ఇప్పుడు డెవలప్ చేశారు. ప్రభుత్వ స్కీంలు అన్నీ తెలంగాణ పుట్టక ముందువే. గడీల మధ్య తెలంగాణ బందీ అయింది. ఒక హోం మంత్రికి కూడా సీఎం గెటు లోపలికి అనుమతి ఉండదు. ఉద్యమకారులను పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు అని మోసం చేశారు. చెరువులు ఎలా కుజించుకపోయాయో నాకు తెలుసు. కూకట్ పల్లికి నేను కొత్త కాదు.. పీజేఆర్ నాకు రోల్ మాడల్. కూకట్ పల్లిని అభివృద్ధి చేస్తా’ అని బండి రమేష్ చెప్పారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!