Bandi Ramesh: గడీల మధ్య తెలంగాణ బందీ అయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kukatpally Congress Candidate Bandi Ramesh Slams BRS Govt: గడీల మధ్య తెలంగాణ బందీ అయిందని, ఒక హోం మంత్రికి గెటు లోపలికి కూడా అనుమతి ఉండదని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ విమర్శించారు. ఉద్యమకారులను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు అని మోసం చేశారని మండిపడ్డారు. సూటు కేసుల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. పార్టీ లైన్ కోసం, ప్రజల కోసం తాను వచ్చానని బండి రమేష్ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన బండి.. తాను ఎదిగిన చోట ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి.. ఆపై టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులలో కొనసాగారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లిలో బండి రమేష్ మాట్లాడుతూ… ‘కూకట్ పల్లి నియోజక వర్గంకు అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకి ధన్యవాదాలు. వెంగళరావు వెళ్ళాడని నేను అనుకోవడం లేదు. అయన బాధ, అవేదన తెలిసిన వ్యక్తిని నేను. సూటు కేసులుతో రాజకీయాల్లోకి రాలేదు… పార్టీ లైన్ కోసం, ప్రజల కోసం పని చేసిన వ్యక్తిని నేను. కేసీఆర్ అడుగు జాడల్లో ఏ పని ఇచ్చినా గెలిపించిన చరిత్ర నాది. ఇన్నాళ్లు పార్టీలకి సేవ చేశా.. ఇక ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మెట్టమెదట ఇఇచ్చిన మాట తప్పారు. తెలంగాణ ఇచ్చాక కాంగ్రెస్ పార్టీలో విలీనం ఆన్నారు, దళిత ముఖ్యమంత్రి ఆన్నారు కానీ ఎది చేయలేదు’ అని అన్నారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
Also Read: Puneeth Rajkumar: ప్రజల మనస్సులో నిలిచి మరణాన్ని జయించిన పునీత్ రాజ్ కుమార్..
‘పైపై మెరుగులు దిద్దడం డెవలప్ కాదు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజుల్లోనే ఫ్లై ఓవర్లు కట్టారు. డ్యాంములు కట్టింది కాంగ్రెస్ అయంలోనే. ఉన్న రోడ్లు మాత్రమే ఇప్పుడు డెవలప్ చేశారు. ప్రభుత్వ స్కీంలు అన్నీ తెలంగాణ పుట్టక ముందువే. గడీల మధ్య తెలంగాణ బందీ అయింది. ఒక హోం మంత్రికి కూడా సీఎం గెటు లోపలికి అనుమతి ఉండదు. ఉద్యమకారులను పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు అని మోసం చేశారు. చెరువులు ఎలా కుజించుకపోయాయో నాకు తెలుసు. కూకట్ పల్లికి నేను కొత్త కాదు.. పీజేఆర్ నాకు రోల్ మాడల్. కూకట్ పల్లిని అభివృద్ధి చేస్తా’ అని బండి రమేష్ చెప్పారు.
తాజావార్తలు
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!