Harish Rao: నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడింది: హరీశ్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Counters to Nirmala Sitharaman Comments: బీజేపీ నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడిందని బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు అన్నారు. పంట పొలాల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వంను ఒత్తిడి చేసిందని, మీటర్లు పెట్టలేదనే తెలంగాణ రాష్ట్రంకు ఇచ్చే డబ్బులు ఇవ్వలేదని అనడం ద్వారా బీజేపీ బండారాన్ని నిర్మలమ్మ స్వయంగా బయటపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ది రైతు పక్షపాత ప్రభుత్వమనే విషయం కేంద్రమంత్రి వ్యాఖ్యలతో తేటతెల్లమైందని హరీశ్ రావు అన్నారు.
బుధవారం మంత్రి హరీశ్ రావు సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ… ‘మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఒత్తిడి చేసింది. లేదంటే రూ. 25 వేల కోట్లు ఇవ్వమని బ్లాక్ మెయిల్కు దిగింది. అయినా కూడా సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గకుండా.. రైతుల పక్షానే నిలిచారు. దేశంలో రైతు పక్షపాతి ఎవరైనా ఉంటే.. అది కేసీఆర్ మాత్రమే. కేంద్ర నిధులు రాకపోయినా పర్వాలేదు కానీ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు సీఎం నిరాకరించారు’ అని గుర్తు చేశారు.
Also Read
- Rahul Gandhi: దేశంలో 88 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
- AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
Also Read: Harish Rao: చివరకు రామక్క పాటని కూడా కాంగ్రెస్, బీజేపీ కాపీ కొట్టింది: హరీష్ రావు
‘కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలు. ఈ రెండు పార్టీలు తెలంగాణ రైతులకు అన్యాయం చేశాయి. కాంగ్రెస్, బీజేపీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టాయి. రాజస్థాన్లో మోటార్లకు మీటర్లు పెట్టారనే విషయం ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తారా?. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే.. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒప్పుకున్నట్లే. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారు. బీడీ కార్మికులకు 5 శాతం జీఎస్టీ పెంచింది బీజేపీ’ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: దేశంలో 88 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..