IND vs NZ: ఇండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ రోహిత్ ఔట్..!
- ఇండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
- న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ ఔట్!
- తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ
- ఈ మ్యాచ్కు విశ్రాంతి ఇవ్వవచ్చని సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తదుపరి మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్తో ఆడనుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరాయి. కాగా.. ఆదివారం జరిగే ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మకు ఈ మ్యాచ్కు విశ్రాంతి ఇవ్వవచ్చని సమాచారం. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం.. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. టీమిండియా మార్చి 4న సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడం సరైనదిగా భావిస్తోంది. కాగా.. కెప్టెన్గా శుభ్మాన్ గిల్ వ్యవహరించనున్నాడు.
Read Also: MLC Kavitha : రెండో దఫా కులగణనలో లోపాలు – బీసీల హక్కులకు ముప్పు
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం శుభ్మాన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ గాయపడటంతో.. కొద్దిసేపు గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. తరువాత రోహిత్ శర్మ స్టేడియంలోకి వచ్చినప్పటికీ ఫిట్గా కనిపించలేదు. మరోవైపు.. రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ ఇద్దరు బుధవారం బ్యాటింగ్ ప్రాక్టీస్ సెస్షన్కు హాజరు కాలేదు. రోహిత్ గాయపడటం, గిల్కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. తర్వాత.. గురువారం గిల్ ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. దీనిని చూసి భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: Maha Kumbh: మహా కుంభమేళా.. అనేక గిన్నిస్ ప్రపంచ రికార్డులు సొంతం..
కాగా.. న్యూజిలాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇస్తే, రిషబ్ పంత్ జట్టులో చేరే అవకాశం ఉంది. శుభ్మాన్ గిల్తో కలిసి కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభించవచ్చు. మరోవైపు.. టీమిండియాలో బ్యాకప్ ఓపెనర్ లేడు. దీంతో యశస్వి జైస్వాల్ జట్టులో స్థానం పొందడం లేదు. అతను ముందుగా జట్టులో స్థానం పొందినప్పటికీ.. చివరి నిమిషంలో అతన్ని ట్రావెలింగ్ రిజర్వ్గా చేర్చారు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి టాప్-15లో స్థానం పొందాడు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!