CS Ramakrishna Rao: ఐఏఎస్ శరత్ వ్యవహార శైలిపై సీఎం ఆగ్రహం.. చర్యలు తప్పవని సీఎస్ హెచ్చరిక!
- ఐఏఎస్ అధికారి శరత్ అత్యుత్సాహం
- ఐఏఎస్ శరత్ వ్యవహార శైలిపై సీఎం ఆగ్రహం
- ఉన్నతాధికారులకు తెలంగాణ సీఎస్ కీలక ఆదేశాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఐఏఎస్ అధికారి శరత్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సభలో పాల్గొనడానికి వచ్చిన సీఎం కాళ్లు మొక్కారు. ఐఎఎస్ శరత్ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ కాళ్లు ఐఏఎస్ శరత్ మొక్కడంపై ఆల్ ఇండియా సర్వీసెస్ అధికార వర్గాల్లో చర్చ జరిగింది. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కే.రామకృష్ణారావు సీరియస్ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: Top Headlines @9PM : టాప్ న్యూస్!
Also Read
- Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
సివిల్ సర్వీసెస్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు స్థాయికి తగినట్లుగా ఉండకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సభలు, సమావేశాల్లో ఉన్నతాధికారులు హుందాగా వ్యవహరించాలి. సభలు, సమావేశాల్లో హుందాగా ఉండకపోతే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రజలను కలిసినప్పుడు ఐఏఎస్, ఐపీఎస్లు ప్రొఫెషనలిజం ప్రదర్శించాలి. ప్రజాప్రతినిధుల పట్ల సివిల్ సర్వీసెస్ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించొద్దు. ఇకపై ఏ అధికారి నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవు’ అని సీఎస్ హెచ్చరించారు. గతంలో ఐఏఎస్లు ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఇకపై ఐఏఎస్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అలా వ్యవహరించవొద్దని సీఎస్తో సీఎం ఆదేశాలు ఇప్పించారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!