Congress Leaders Protest: ఎంపీల సస్పెండ్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతల నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Leaders: పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన చెప్పారు. దేశంలో ప్రజా స్వామ్యం ఉందా.. నియంతృత్వ పోకడతో పాలన నడుస్తుంది.. దేశాన్ని రక్షించాలి అని ఆలోచన బీజేపీకి లేదు.. 146 మంది సభ్యులను సస్పెండ్ చేయడం ఏంటి? అని భట్టి విక్రమార్క అన్నారు.
Read Also: Naa Saami Ranga: థియేటర్ల వేటలో నా సామి రంగా!
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ఇక, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీజేపీ నియంత్ర్యత్వ ధోరణి వ్యవహరిస్తుంది.. పార్లమెంట్ పై దాడి జరిగితే సమాధానం లేదు.. పార్లమెంట్ కి భద్రత ఇచ్చే పరిస్థితి ఎన్డీయేకి లేదు.. దేశానికి భద్రత ఎలా కల్పిస్తారు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చట్టాలు తెస్తున్నారు.. ఎంపీల గొంత నొక్కుతూ సభ నుంచి సస్పెండ్ చేశారు.. బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలా లేదా అనేది ప్రజలు ఆలోచించాలి.. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశత్వంతో ధర్నా చౌక్ ని తీసేసింది.. హైకోర్టు ధర్నా చౌక్ కి అనుమతి ఇచ్చింది.. ప్రజలంతా నిరంకుషత్వ ప్రభుత్వాన్ని తొలగించారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Read Also: AP CID: లోకేష్ను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నా చేస్తుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. పార్లమెంట్ లో పొగ బాంబులు వేస్తే ప్రధాని మోడీ ఇంత వరకు సమాధానం చెప్పలేదు.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెన్షన్ చేశారు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మీ పునాదులు కదులుతున్నాయి.. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకూషత్వంగా వ్యవహరిస్తుంది అని ఆయన విమర్శలు గుప్పించారు.
Read Also: Telangana: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారు..
బీజేపీ పార్టీ దేశంలో కుల మతాల పేరుతో ప్రజలను విచ్చిన్నం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రజలను గాలికొదిలేశారు.. పార్లమెంట్ పై దాడి జరిగితే కనీసం స్పందించలేదు.. మీ హయాంలో దేశ ప్రజల స్థితిగతులు మారయా?.. దేశం అప్పుల కుప్పగా మారింది.. ఎంపీలను సస్పెండ్ చేసినట్టే మిమ్మల్ని ప్రజలు చేస్తారు.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది.. 2 నెలల సమయం ఉంది.. ప్రజలు బుద్ది చెబుతారని ఆయన అన్నారు. మోడీ హయాంలో విధ్వంసాలు జరుగుతున్నాయి.. ప్రశాంతంగా ఉన్నా రాష్ట్రాలు కల్లోలం అవుతున్నాయి.. మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెబుతారు అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!