Congress Leaders Protest: ఎంపీల సస్పెండ్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతల నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Leaders: పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన చెప్పారు. దేశంలో ప్రజా స్వామ్యం ఉందా.. నియంతృత్వ పోకడతో పాలన నడుస్తుంది.. దేశాన్ని రక్షించాలి అని ఆలోచన బీజేపీకి లేదు.. 146 మంది సభ్యులను సస్పెండ్ చేయడం ఏంటి? అని భట్టి విక్రమార్క అన్నారు.
Read Also: Naa Saami Ranga: థియేటర్ల వేటలో నా సామి రంగా!
Also Read
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
ఇక, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీజేపీ నియంత్ర్యత్వ ధోరణి వ్యవహరిస్తుంది.. పార్లమెంట్ పై దాడి జరిగితే సమాధానం లేదు.. పార్లమెంట్ కి భద్రత ఇచ్చే పరిస్థితి ఎన్డీయేకి లేదు.. దేశానికి భద్రత ఎలా కల్పిస్తారు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చట్టాలు తెస్తున్నారు.. ఎంపీల గొంత నొక్కుతూ సభ నుంచి సస్పెండ్ చేశారు.. బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలా లేదా అనేది ప్రజలు ఆలోచించాలి.. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశత్వంతో ధర్నా చౌక్ ని తీసేసింది.. హైకోర్టు ధర్నా చౌక్ కి అనుమతి ఇచ్చింది.. ప్రజలంతా నిరంకుషత్వ ప్రభుత్వాన్ని తొలగించారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Read Also: AP CID: లోకేష్ను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నా చేస్తుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. పార్లమెంట్ లో పొగ బాంబులు వేస్తే ప్రధాని మోడీ ఇంత వరకు సమాధానం చెప్పలేదు.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెన్షన్ చేశారు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మీ పునాదులు కదులుతున్నాయి.. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకూషత్వంగా వ్యవహరిస్తుంది అని ఆయన విమర్శలు గుప్పించారు.
Read Also: Telangana: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారు..
బీజేపీ పార్టీ దేశంలో కుల మతాల పేరుతో ప్రజలను విచ్చిన్నం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రజలను గాలికొదిలేశారు.. పార్లమెంట్ పై దాడి జరిగితే కనీసం స్పందించలేదు.. మీ హయాంలో దేశ ప్రజల స్థితిగతులు మారయా?.. దేశం అప్పుల కుప్పగా మారింది.. ఎంపీలను సస్పెండ్ చేసినట్టే మిమ్మల్ని ప్రజలు చేస్తారు.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది.. 2 నెలల సమయం ఉంది.. ప్రజలు బుద్ది చెబుతారని ఆయన అన్నారు. మోడీ హయాంలో విధ్వంసాలు జరుగుతున్నాయి.. ప్రశాంతంగా ఉన్నా రాష్ట్రాలు కల్లోలం అవుతున్నాయి.. మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెబుతారు అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!