Telangana Congress: నేడు సీఎం అధ్యక్షతన కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం..
- నేడు సీఎం అధ్యక్షతన కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం..
- స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్పై చర్చలు జరిగే అవకాశం.
- నాంది మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress: హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్పై చర్చించనున్నట్లు సమాచారం. రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. ఈ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ సమావేశమవుతారు. ఆ తర్వాత జిల్లాల వారీగా భేటీలు జరుగుతాయి. మొదట ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత కరీంనగర్, వరంగల్.. అనంతరం నల్గొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఆయా జిల్లాల్లోని మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా హాజరవుతారు.
Also Read: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
- CJP: "ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే".. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
- VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
- Sharad Pawar: "మోడీ నా మాట విన్నారు".. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
అన్ని జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం పెంచడమే ఈ భేటీల ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాల నుండి సమాచారం. నియోజకవర్గ స్థాయిలో తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించేందుకు, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంపై పార్టీ దృష్టిపెట్టనుంది. సంక్రాంతి అనంతరం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలు ప్రస్తావించారు. కొందరు మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా సీఎం రేవంత్ ఈ నెల 1న మంత్రులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. నిధుల వినియోగం, మార్చి వరకు ప్రభుత్వ ప్రాధాన్యాలను స్పష్టంగా తెలియజేశారు. అలాగే, ఎమ్మెల్యేల వ్యవహారశైలి, మంత్రుల మధ్య సమన్వయం, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై చర్చించారు.
Also Read: Ram Charan RC 16: రామ్ చరణ్ RC 16 షూట్ కి స్పెషల్ గెస్ట్
కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తిని అధిగమించడానికి, పార్టీ కేడర్తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి గురువారం సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలకు ప్రణాళికలు రూపొందించే సదవకాశంగా మారనుంది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
-
CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
-
Sharad Pawar: “మోడీ నా మాట విన్నారు”.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!