Cold Wave : తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత
- తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత
- రెండు రోజులుగా అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు
- ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి పంజా
- కొమురంభీం, నిర్మల్, ఆదిలాబాద్కు ఎల్లో అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cold Wave : తెలంగాణలో శీతాకాలం ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ ఏడాది చలి తీవ్రత గతేడాది కంటే మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. రెండు రోజులుగా రాష్ట్రంలో చలి విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వివరించారు.
ఉత్తర తెలంగాణలో ఎల్లో అలర్ట్
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత భారీగా ఉండే అవకాశమున్నందున ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమయానికి చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశముందని తెలిపారు. ఈశాన్య గాలులు రాష్ట్రంలో చురుకుగా వీస్తుండటం, తూర్పు గాలుల ప్రభావం కూడా ఉండటంతో చలి తీవ్రతతో పాటు పొగమంచు కూడా అధికంగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి
తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోల్చితే 2–4 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లో 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
కుమురంభీం జిల్లా సిర్పూర్, గిన్నెదారి: 6.5°C
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్: 7.7°C
కుమురంభీం జిల్లా తిర్యానీ: 7.9°C
వికారాబాద్ జిల్లా మోరీన్పేట: 7.3°C
సంగారెడ్డి జిల్లా కోహిర్: 6.9°C
ఆదిలాబాద్ జిల్లా బేల: 7.1°C
ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ: 7.2°C
ప్రజలకు అప్రమత్తత సూచన
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రతతో పాటు ఉదయం వేళలు దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.
హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలు
హైదరాబాద్లో కూడా సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చితే 2 డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది.
నిరంతరం తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా కుమురంభీం జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
చలి తీవ్రతకు కారణాలు
ఈశాన్య గాలులతో పాటు తూర్పు గాలుల ప్రభావం కూడా రాష్ట్రంలో అధికంగా ఉండటమే చలి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.
ప్రజలు చలి తీవ్రతకు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Mid Day Meal In Colleges: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!