Cold Wave : తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత
- తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత
- రెండు రోజులుగా అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు
- ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి పంజా
- కొమురంభీం, నిర్మల్, ఆదిలాబాద్కు ఎల్లో అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cold Wave : తెలంగాణలో శీతాకాలం ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ ఏడాది చలి తీవ్రత గతేడాది కంటే మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. రెండు రోజులుగా రాష్ట్రంలో చలి విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వివరించారు.
ఉత్తర తెలంగాణలో ఎల్లో అలర్ట్
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత భారీగా ఉండే అవకాశమున్నందున ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమయానికి చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశముందని తెలిపారు. ఈశాన్య గాలులు రాష్ట్రంలో చురుకుగా వీస్తుండటం, తూర్పు గాలుల ప్రభావం కూడా ఉండటంతో చలి తీవ్రతతో పాటు పొగమంచు కూడా అధికంగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read
ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి
తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోల్చితే 2–4 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లో 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
కుమురంభీం జిల్లా సిర్పూర్, గిన్నెదారి: 6.5°C
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్: 7.7°C
కుమురంభీం జిల్లా తిర్యానీ: 7.9°C
వికారాబాద్ జిల్లా మోరీన్పేట: 7.3°C
సంగారెడ్డి జిల్లా కోహిర్: 6.9°C
ఆదిలాబాద్ జిల్లా బేల: 7.1°C
ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ: 7.2°C
ప్రజలకు అప్రమత్తత సూచన
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రతతో పాటు ఉదయం వేళలు దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.
హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలు
హైదరాబాద్లో కూడా సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చితే 2 డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది.
నిరంతరం తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా కుమురంభీం జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
చలి తీవ్రతకు కారణాలు
ఈశాన్య గాలులతో పాటు తూర్పు గాలుల ప్రభావం కూడా రాష్ట్రంలో అధికంగా ఉండటమే చలి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.
ప్రజలు చలి తీవ్రతకు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Mid Day Meal In Colleges: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు
తాజావార్తలు
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!