Kadam Project: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈక్రమంలో కడెం పరివాహక ప్రాంతానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో బుధవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు కిందికి వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాథోడ్ విట్టల్ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 20.138 క్యూసెక్కులు ఔట్ ఫ్లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు, మొదలైన జీవాలు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.…
Weather Updates : తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. తెల్లవారుజామునే ఎండలు మండి పడటంతో ప్రజలు దైనందిన పనులు చేసుకోవడానికే ఇబ్బందిపడుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వడగాలులతో ఉక్కిరిబిక్కిరి తీవ్ర వేడి ప్రభావంతోపాటు వడగాలులు…
Weather Updates : సంక్రాంతి పండుగ ముగిసినా, తెలుగు రాష్ట్రాలను చలి వదలడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయి, ప్రజలు ఆహారపు జాగ్రత్తలు పాటించేందుకు, వేడి బట్టలు ధరించేందుకు మక్కువ చూపుతున్నారు. ఆరెంజ్ అలర్ట్ జారీ: తెలంగాణలో సోమవారం తెల్లవారుజాము నుంచి చలి తీవ్రత అధికంగా నమోదు కావడంతో వాతావరణ శాఖ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.…
Cold Wave : తెలంగాణలో శీతాకాలం ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ ఏడాది చలి తీవ్రత గతేడాది కంటే మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. రెండు రోజులుగా రాష్ట్రంలో చలి విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వివరించారు. ఉత్తర తెలంగాణలో ఎల్లో అలర్ట్ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత…