Mid Day Meal In Colleges: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు
- నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు
- ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు పథకం అమలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mid Day Meal In Colleges: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుండి మధ్యాహ్న భోజనం అందించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు ఈ పథకం ప్రారంభచనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో 1,48,419 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. విజయవాడ పాయకాపురం నుండి మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా పోలీసు బందోబస్తు
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో 398 కళాశాలలు సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయని, దాంతో జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా పాఠశాలల్లోనే భోజనం తయారు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. మిగిలిన 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు అధికారులు. ఈ పథకం కోసం ఈ ఏడాదిలో రూ.27 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రధానంగా ఈ పథకం పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అనేక ప్రాంతాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరి చాలామంది విద్యార్థులు చాలా దూరం ప్రయాణించి కాలేజీకి చేరుకుంటున్నారు. వారందరికీ మధ్యాహ్న భోజనం అందించడం మంచి తోడ్పాటును అందించనుంది.
ఇక మధ్యన భోజనంలో ఏం పెడతారన్న విషయానికి వస్తే..
* సోమవారం నాడు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు.
* మంగళవారం నాడు అన్నం, పప్పు, ఎగ్ కర్రీ, రసం, రాగిజావ అందిస్తారు.
* బుధవారం నాడు వెజ్ పులావ్, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు.
* గురువారం నాడు అన్నం, సాంబార్, ఎగ్ కర్రీ, రాగిజావ అందిస్తారు.
* శుక్రవారం నాడు పులిహోర, గోంగూర లేదా కూరగాయలతో చేసిన చట్నీ, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు.
* శనివారం నాడు అన్నం, వెజ్ కర్రీ, రసం, రాగిజావ, పొంగల్ స్వీట్ అందిస్తారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!