Mid Day Meal In Colleges: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు
- నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు
- ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు పథకం అమలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mid Day Meal In Colleges: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుండి మధ్యాహ్న భోజనం అందించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు ఈ పథకం ప్రారంభచనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో 1,48,419 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. విజయవాడ పాయకాపురం నుండి మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా పోలీసు బందోబస్తు
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో 398 కళాశాలలు సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయని, దాంతో జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా పాఠశాలల్లోనే భోజనం తయారు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. మిగిలిన 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు అధికారులు. ఈ పథకం కోసం ఈ ఏడాదిలో రూ.27 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రధానంగా ఈ పథకం పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అనేక ప్రాంతాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరి చాలామంది విద్యార్థులు చాలా దూరం ప్రయాణించి కాలేజీకి చేరుకుంటున్నారు. వారందరికీ మధ్యాహ్న భోజనం అందించడం మంచి తోడ్పాటును అందించనుంది.
ఇక మధ్యన భోజనంలో ఏం పెడతారన్న విషయానికి వస్తే..
* సోమవారం నాడు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు.
* మంగళవారం నాడు అన్నం, పప్పు, ఎగ్ కర్రీ, రసం, రాగిజావ అందిస్తారు.
* బుధవారం నాడు వెజ్ పులావ్, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు.
* గురువారం నాడు అన్నం, సాంబార్, ఎగ్ కర్రీ, రాగిజావ అందిస్తారు.
* శుక్రవారం నాడు పులిహోర, గోంగూర లేదా కూరగాయలతో చేసిన చట్నీ, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు.
* శనివారం నాడు అన్నం, వెజ్ కర్రీ, రసం, రాగిజావ, పొంగల్ స్వీట్ అందిస్తారు.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..