Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Tdp Leaders Have Complained To Cs Against Ttd Former Eo Dharma Reddy And Former Chairman Karunakar Reddy

TDP: టీటీడీ మాజీ ఈవో, మాజీ చైర్మన్‌పై సీఎస్‌కు ఫిర్యాదు.. విచారణ జరిపించండి..

Published Date :July 8, 2024 , 8:02 pm
By Sudhakar Ravula
  • సీఎస్ నీరభ్ కుమార్‌కు కలిసిన టీడీపీ నేతలు..
  • టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి.. మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ఫిర్యాదు..
  • సీబీ సీఐడి లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరపాలని వినతి..
TDP: టీటీడీ మాజీ ఈవో, మాజీ చైర్మన్‌పై సీఎస్‌కు ఫిర్యాదు.. విచారణ జరిపించండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

TDP: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై సీఎస్ నీరభ్ కుమార్‌కు ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్.. సీఎస్‌కు కలిసి ఫిర్యాదు చేశారు.. వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని, కాబట్టి వారిపై సీబీ సీఐడి లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని కోరారు.. ఈ సందర్భంగా సీఎస్‌కు ఓ లేఖను అందజేశారు టీడీపీ నేతలు..

Read Also: CPI Narayana: రాజకీయాల్లో వైఎస్ విలక్షణమైన వ్యక్తి..

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
  • Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..

సీఎస్‌కు టీడీపీ రాసిన లేఖలోని అంశాలు:
* సాంప్రదాయానికి విరుద్ధంగా IAS అధికారికి కాకుండా ధర్మారెడ్డిని JEOగా తరువాత EOగా గత ప్రభుత్వం నియమించింది.
* తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సమయంలో వైసీపీకి విరాళాల సేకరణకు మార్గంగా ధర్మారెడ్డి వ్యవహరించారు.
* తిరుమలలో గెస్ట్ హౌస్‌లకు కేటాయించే భూముల్లో కూడా ధర్మారెడ్డి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ను పాటించలేదు. ఫర్నిచర్ల మార్పు పేరుతో కోట్ల రూపాయిలు పక్కదారి పట్టించారు.
* భక్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా.. రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టేందుకు ధర్మారెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్తుండేవారు.
* ధర్మారెడ్డి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే క్రిమినల్ కేసుల్లో ఆయన రాజకీయ ప్రమేయం, కుతంత్రాలు స్పష్టంగా తేటతెల్లమవుతాయి.
* 2 కోట్లు విలువ గల డైమెండ్ వాచ్‌ను హైకోర్టు జడ్జికి ఆఫర్ చేసారనే వదంతులు కూడా ధర్మారెడ్డిపై ఉన్నాయి.
* మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలిద్దరూ బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా సివిల్ కాంట్రాక్టులకు టీటీడీ నిధులను పక్కదారి పట్టించారు.
* బడ్జెట్ పరిమితిని అధిగమించి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూ. 475 కోట్లకు పెంచగా.. అనంతరం చైర్మనైన కరుణాకర్ రెడ్డి భారీగా రూ.1,772 కోట్లకు పెంచి తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారు.
* ఎన్నికల్లో అభినయ్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలు తెగబడ్డారు.
* శ్రీవాణి టికెట్లు పేరుతో రూ.10,500 వసూలు చేసి ఆ డబ్బులు ఏ రకంగా ఖర్చు చేశారో చూపించలేదు.
* ఎవరు టీటీడీకి విరాళాలు ఇచ్చినా అవి శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్‌లోకి జమవ్వడంతో టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏ పని అయినా చేసుకునేలా అవకాశం కల్పించారు.
* పద్మావతి ఆస్పత్రి (రూ.550 కోట్లు), బాలాజీ ఇన్స్‌టిట్యూట్(రూ.324 కోట్లు), స్విమ్స్ కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణాల్లో కూడా భారీ అక్రమాలకు పాల్పడ్డారు.
* ఆసుపత్రుల నిర్మాణానికి రూ.1 కోటి నుంచి 1.5 కోట్లు విరాళం ఇచ్చే భక్తులకు 531 ఉదయాస్తమన సేవా టికెట్లు ఇచ్చి భారీ కుంభకోణానికి తెర లేపారు.
* రూ.200 కోట్లతో తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ యాత్రా సముదాయం నిర్మాణం విషయంలో టీటీడీ కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిర్మాణ పనులు చేపట్టడానికి అనుమతించాలని ఒత్తిడి తెచ్చింది.
* తిరుమలలో గెస్ట్ హౌస్‌ల నిర్మాణం మరియు విరాళాల విషయంలో వ్యక్తిగత దాతల విషయంలో టీటీడీ పూర్తిగా భిన్నమైన పద్ధతిని అవలంభించింది.
* తిరుమల కాంప్లెక్స్ 5 నిర్మాణంలో రూ.98 కోట్లు కమిషన్ల రూపంలో పక్కదారి పట్టాయి.
* వైసీపీ బడా నాయకుల సిఫార్సు చేసిన వారినే టీటీడీలోని సలహాదారులను, ఉద్యోగులుగా ధర్మారెడ్డి నియమించారు.
* ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై సీబీ సీఐడి లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించి అక్రమాలను వెలుగు తీయాలి.. అంటూ సీఎస్‌కు ఫిర్యాదు చేసిన లేఖలో పేర్కొన్నారు టీడీపీ నేతలు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap cs
  • dharma reddy
  • Karunakar Reddy
  • tdp

తాజావార్తలు

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

  • Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!

  • Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్‌.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల

  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions