Nagarjuna : ప్రధాని మోడీని కలిసిన నాగార్జున కుటుంబం.. ఎందుకంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్లో కలిశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు (ANR) 100వ జయంతిని పురస్కరించుకుని “మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ” అనే గ్రంథాన్ని ప్రధాని మోదీకి అందించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత, పద్మభూషణ అవార్డు గ్రహీత, మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించారు. ఆయన విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ అక్కినేని నాగేశ్వరరావు సమగ్ర కృషిని, భారతీయ సినీ రంగానికి చేసిన విశేష సేవలను కొనియాడారు. ప్రత్యేకించి, తెలుగు సినీ పరిశ్రమను చెన్నై నుండి హైదరాబాద్కు మళ్లించి.. ప్రస్తుతం అభివృద్ధి చెందే స్థాయికి తీసుకువెళ్లడంలో ఏఎన్ ఆర్ పాత్ర అపూర్వమైనదని కొనియాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏఎన్ఆర్ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మహానటుడు అని పేర్కొన్నారు. ఆయన చేసిన చిత్రాలు తెలుగు సినిమా ప్రత్యేకతను ప్రపంచానికి చాటించాయని ప్రశంసించారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
మన్ కీ బాత్ లో ఏఎన్ఆర్ ప్రస్తావన
117వ “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ ఏఎన్ఆర్ గురించి ప్రస్తావించిన విషయాన్ని నాగార్జునతో పంచుకున్నారు. ఏఎన్ఆర్ తో పాటు, టపన్ సిన్హా, రాజ్ కపూర్ లాంటి భారతీయ సినిమా దిగ్గజాలను తన ప్రసంగంలో గుర్తుచేసినట్లు తెలిపారు. ఏఎన్ఆర్ కేవలం నటుడే కాకుండా, విద్య, సాహిత్యం, సేవారంగాల్లోనూ ఎనలేని కృషి చేశారు అని మోదీ ప్రశంసించారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి తెలుగు చిత్రపరిశ్రమకు బలమైన మద్దతునిచ్చారని, అక్కినేని నాగేశ్వరరావు కళాశాల (గుడివాడ) వంటి విద్యాసంస్థల స్థాపన ద్వారా విద్యాభివృద్ధికి దోహదపడ్డారని గుర్తు చేశారు.
Read Also:Virat Kohli: ‘కింగ్ కోహ్లీ’ తర్వాత మ్యాచ్పై అప్డేట్.. ఇంతకీ ఆడుతాడా.. లేదా..?
ఏఎన్ఆర్ సినీ ప్రయాణం
ఏడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఏఎన్ఆర్ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి, సినీ ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మోదీ వ్యాఖ్యానించారు. “నేను నా జీవితం”, “మనసులోని మాట” వంటి రచనల ద్వారా ఆయన జీవన సత్యాలను విశ్లేషించారని అభిప్రాయపడ్డారు. ఏఎన్ఆర్ భారతీయ సినిమాకు అంకితభావంతో పనిచేసిన మహానుభావుడు మాత్రమే కాకుండా, భారతీయ కళా, సాహిత్య సంప్రదాయాలకు గౌరవం తీసుకువెళ్లిన మేధావి అని ప్రధాని కొనియాడారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!