Mahesh Goud : జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ.. మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- మంత్రివర్గ విస్తరణపై మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయం
- కొండా సురేఖ వ్యాఖ్యలపై క్లారిటీ
- సోషల్ మీడియా ఫేక్ న్యూస్ చర్యలు : మహేశ్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Goud : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్లో మంత్రివర్గ విస్తరణపై స్పందించిన ఆయన, ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరగవచ్చని అభిప్రాయపడ్డారు. వివిధ సమీకరణాల కారణంగా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్నవారెంతైనా ఎక్కువగా ఉన్నప్పటికీ ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటం వలన ఆలస్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోవాల్సినదని, వారి పార్టీ కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తున్నామని తెలిపారు. హైకమాండ్ ఇంకా ముఖ్యమంత్రి ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని, వీలైనంత త్వరగా విస్తరణ జరుగుతుందని ఆశ వ్యక్తం చేశారు.
RCB vs KKR: బెంగళూరులో ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సజావుగా సాగేనా?
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
అలాగే, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, ఆమె మాటలను తప్పుగా వక్రీకరించడం జరిగిందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఫేక్ న్యూస్ నిబంధనలను తెలంగాణలో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. టీపీసీసీ కార్యవర్గం ఈ నెల 26, 27 తేదీల్లో సమావేశమవ్వనున్నదని కూడా చెప్పారు. ఇంకా, తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు విషయంలో ప్రతిపక్షాల ప్రచారాలు తప్పుడు వార్తలేనని ఖండించారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన విషయానికి వస్తే, అది సర్వసాధారణం అని, మహిళలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రాధాన్యం ఇతర పార్టీలతో పోల్చలేనిదని అన్నారు.
India-Pakistan: పాకిస్థాన్పై దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం.. ఏడు అఖిలపక్ష బృందాల ఏర్పాటు..
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!