Telangana Assembly: ఆ విషయాలపై దద్దరిల్లిన అసెంబ్లీ..
- పలు విషయాలపై సభలో చర్చ.
- నీటి సంబంధిత విషయాలు.
- గ్రూప్ 1 పోస్టుల సంబంధించి చర్చ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly On Wednesday: బుధవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మండలిలో సభ్యులైన.. తాతా మధు ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. మేడిగడ్డలో నీళ్ళు వృథాగా పోతున్నాయి. ప్రాజెక్ట్ లలో నీళ్ళు అడుగంటునయి. ప్రాజెక్ట్ లలో నీటి నిల్వ కోసం ఏమి చర్యలు తీసుకుంటుంది అంటూ ప్రశ్నలను ఆయన లేవనెత్తాడు. ఇక ఇందుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిస్తూ.. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన మేడిగడ్డ వద్ద వృథాగా నీళ్ళు పోతున్నాయి.. అయినప్పటికీ సాగు నీటి ప్రాజెక్ట్ లలో నీటిని నిల్వ చేయడం వలన సాగు నీటి తాగు నీటి సమస్యలు రావడం లేదుని తెలుపుతూ.. ప్రస్తుతం కొనసాగుతున్న రేషన్ కార్డులు చెలామణి అవుతాయి. కొత్త వాళ్ళకు, అర్హులైన వారికి త్వరలో రేషన్ కార్డులు ఇస్తాము. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆయన అన్నారు.
Olympics 2024: వామ్మో.. ఒలంపిక్స్ కోసం ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతోందా..?
Also Read
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఇక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గోదావరిలో వరద లేదు. ప్రాణహితలో వరద బాగా వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని బ్యారేజ్ లు సక్రమంగా నిర్మించకపోవడం వలన నీళ్ళు వృథాగా పోతున్నాయని ఆయన అన్నారు. రైతు భరోసా అమలు చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం వ్యవహారం వలన 26,000 వేల కోట్లు నిధులు వృథా అయ్యాయి. రైతు భరోసా పై గైడ్ లైన్స్ ఎలా ఉండాలనేది రెండు సభలలో చర్చిస్తాం. ఆగస్టు 31 లోపు రుణమాఫీ పూర్తి చేస్తాము అని ఆయన తెలిపారు.
Bengaluru: అర్ధరాత్రి హస్టల్లోకి చొరబడి, యువతి గొంతు కోసి హత్య..
ఇక మరోవైపు ఎమ్మెల్సీ వాణీ దేవి మాట్లాడుతూ.. పెండింగ్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించగా.. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క.. జీతాలు ఒకటవ తేదిన ఇస్తున్నాము.. అలాగే నిధులు త్వరలో విడుదల చేస్తాము.. ఇంకా గృహ లక్ష్మి పథకంను మార్చి 1 నుండి అమలు చేస్తున్నాము. ఇప్పటి వరకు ఒక కోటి 79,33,430 మందికి జీరో బిల్లులు అమలు చేశాము. 640.9 కోట్లు డిస్కంలకు చెల్లించాము.. ఒక నెల ఎక్కువగా వస్తే పథకం నుండి వారిని తీసివేయము. ఇక అదే సభలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ మాట్లాడుతూ.. గ్రూప్ 1 పోస్టులలో 1:50 అమలు చేయడం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి యూపిఎస్సి తరహాలో అమలు చేయాలని డిమాండ్ చేసారు.
తాజావార్తలు
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!