TG Assembly: భూభారతి బిల్లుపై చర్చను అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం
- భూభారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంపై అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం
- శాసనసభలో బీఆర్ఎస్పై నిప్పులు చెరిగిన అక్బరుద్దీన్ ఓవైసీ
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసమా..? కుటుంబం కోసం పోరాటం చేస్తున్నారా..?
- మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం- అక్బరుద్దీన్
- బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు ప్రజల గొంతు నొక్కేశారు- కూనంనేని
- మా గొంతు నొక్కే అధికారం మీకు ఎవరిచ్చారు- కూనంనేని
- అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎవరిని మాట్లాడనివ్వలేదు- కూనంనేని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana assembly meetings on day 6: భూభారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంపై అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బీఆర్ఎస్పై అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసమా..? కుటుంబం కోసం పోరాటం చేస్తున్నారా? అని దుయ్యబట్టారు. తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని అక్బరుద్దీన్ అన్నారు. మీ కుటుంబం కోసం అసెంబ్లీలో పోరాటం ఏమిటి..? అని ప్రశ్నించారు. ముమ్మాటికీ ధరణిలో అక్రమాలు జరిగాయి.. ధరణి కేవలం కేసీఆర్ కుటుంబం కోసం తీసుకొచ్చారని ఆరోపించారు. 10 ఏళ్ళు తెలంగాణలో కచరా గవర్నమెంట్ ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల కోసం వచ్చారా…? లేక కేసీఆర్ కుటుంబం కోసం వచ్చారా..? అక్బరుద్దీన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అవసమైతే సభ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయండి.. అసెంబ్లీలో సభ్యులు అనుసరించే వ్యూహం ఇదేనా…? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పాలని అక్బరుద్దీన్ తెలిపారు.
Read Also: YCP-Visakha Dairy: వైసీపీకి విశాఖ డెయిరీ ఛైర్మన్ రాజీనామా!
Also Read
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు ప్రజల గొంతు నొక్కేశారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తమ గొంతు నొక్కే అధికారం మీకు ఎవరిచ్చారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎవరిని మాట్లాడనివ్వలేదు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని మాట్లాడనివ్వడం లేదని తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డిని 5 నిమిషాలు కూడా మాట్లాడనిచ్చేవారు కాదని అన్నారు. తాము అనుకున్నట్లుగానే సభ నడవాలని బీఆర్ఎస్ అనుకుంటోంది.. సభలో బీఆర్ఎస్ సభ్యుల తీరు బాగోలేదని కూనంనేని పేర్కొన్నారు.
Read Also: KTR Petition: ఏసీబీ కేసు.. కేటీఆర్ పిటిషన్ కాపీలో పేర్కొన్న అంశాలు ఇవే..
- Tags
- BRS
- CM Revanth Reddy
- congress
- day 6
- ktr
తాజావార్తలు
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!