YCP-Visakha Dairy: వైసీపీకి విశాఖ డెయిరీ ఛైర్మన్ రాజీనామా!
- వైసీపీకి విశాఖ డెయిరీ ఛైర్మన్ రాజీనామా
- 12 మంది డైయిరీ డైరెక్టర్లు కూడా
- వ్యక్తిగత కారణాలతో రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి ఆనంద్ రాజీనామా చేశారు. ఆనంద్తో పాటు 12 మంది డైయిరీ డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఆనంద్ తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్కు పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ఆనంద్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ కార్యకలాపాలకు ఆడారి ఆనంద్ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు.
వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన వారిలో విశాఖ డెయిరీ డైరెక్టర్లు శరగడం వరాహ వెంకట శంకర్రావు, కోళ్ల కాటమయ్య, పిల్లా రమా కుమారి, శీరంరెడ్డి సూర్యనారాయణ, ఆరంగి రమణబాబు, చిటికెల రాజకుమారి, దాడి పవన్ కుమార్, రెడ్డి రామకృష్ణ, పరదేశి గంగాధర్, సుందరపు ఈశ్వర్ ఉన్నారు. అందరూ వైసీపీ కేంద్ర కార్యాలయానికి తమ రాజీనామా లేఖలను పంపించారు. రాజీనామా లేఖలు ఇంకా అధికారికంగా వైసీపీకి చేరలేదని సమాచారం.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..