Abdul Razak: పాకిస్థాన్ తో టీమిండియా ఆడితే ఓడిపోతుంది.. అందుకే సిరీస్ లు ఆడడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే ప్రపంచకప్ 2023 మెగా ఈవెంట్ కోసం 2016 తర్వాత దాయాది పాకిస్థాన్ టీమ్ 7 సంవత్సరాల తర్వాత భారత్ లో అడుగుపెట్టబోతుంది. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా ఆడే మ్యాచ్ లన్నీ తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ఆడే మ్యాచ్ లన్నీ కూడా తటస్థ వేదికపై నిర్వహించాలని ముందు నుంచి పాక్ క్రికెట్ బోర్డు పట్టుబట్టింది.
Read Also: Health Tips : వర్షాకాలంలో పొరపాటున కూడా వీటి జోలికి వెళ్ళకండి..
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
అయితే.. టీమిండియా ఓడిపోతామనే భయంతోనే పాకిస్తాన్తో సిరీస్ ఆడేందుకు ఇష్టపడడం లేదని పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. ‘ఇండియా- పాకిస్తాన్ జట్ల మధ్య మంచి గౌరవం, స్నేహం గతంలో ఉండేవి.. కానీ ఇప్పుడున్న టీముల్లో భారత జట్టు ఒక్కటే, పాకిస్తాన్తో సిరీస్లు ఆడడం లేదు.. వాళ్లు ఎందుకు ఆడడం లేదో తెలుసా.. పాక్ జట్టు పటిష్టంగా ఉంది.. ఒకవేళ ఆడితే ఓడిపోతామనే భయంతోనే మ్యాచ్ లు ఆడటం లేదని రజాక్ చెప్పాడు. ఇంతకు ముందు కూడా మాతో ఇండియా మ్యాచులు ఆడినప్పుడల్లా ఓడిపోయేవాళ్లు అంటూ వ్యాఖ్యనించాడు.
Read Also: Godavari River : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల అద్దం పడుతున్న గోదావరి
ఇప్పుడు పరిస్థితి మారింది.. 2023లో ఉన్నాం.. ఇప్పటికైనా బీసీసీఐ ఆలోచనలు మార్చుకుంటే మంచిది అని అబ్దుల్ రజాక్ అన్నాడు. ఇప్పుడు చిన్న టీమ్ లేదు, పెద్ద టీమ్ లేదు.. ఆ రోజు ఏ టీమ్ బాగా ఆడితే అదే గెలుస్తుంది.. భారత జట్టు కూడా పాక్ టీమ్లాగే పటిష్టంగా ఉంది.. యాషెస్ సిరీస్లో ఏ జట్టు బలమైనదో చెప్పగలమా? అలాగే ఇండియా, పాకిస్తాన్లలో ఏ టీమ్ బలమైనదో చెప్పలేం అని అతడు తెలిపాడు.
Read Also: Minister Vidadala Rajini: మంత్రి విడదల రజనీకి అస్వస్థత.. వెంటనే బెజవాడకు..
ఇరు జట్ల మధ్య సంబంధాలు మెరుగు అవ్వాలంటే వరుసగా టీ20, టెస్టు, వన్డే సిరీస్లు జరగాలి అని పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అన్నారు. అందుకు బీసీసీఐ ముందుకు వస్తే బాగుంటుంది.. అంటూ ఆయన కామెంట్ చేశాడు. జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి చిన్న టీమ్స్తో గెలవడానికి కూడా అపసోపాలు పడే పాక్ జట్టుతో ఆడేందుకు టీమిండియా ఎందుకు భయపడుతుందని అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు… భలే కామెడీగా ఉన్నాయని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!