Abdul Razak: పాకిస్థాన్ తో టీమిండియా ఆడితే ఓడిపోతుంది.. అందుకే సిరీస్ లు ఆడడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే ప్రపంచకప్ 2023 మెగా ఈవెంట్ కోసం 2016 తర్వాత దాయాది పాకిస్థాన్ టీమ్ 7 సంవత్సరాల తర్వాత భారత్ లో అడుగుపెట్టబోతుంది. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా ఆడే మ్యాచ్ లన్నీ తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ఆడే మ్యాచ్ లన్నీ కూడా తటస్థ వేదికపై నిర్వహించాలని ముందు నుంచి పాక్ క్రికెట్ బోర్డు పట్టుబట్టింది.
Read Also: Health Tips : వర్షాకాలంలో పొరపాటున కూడా వీటి జోలికి వెళ్ళకండి..
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
అయితే.. టీమిండియా ఓడిపోతామనే భయంతోనే పాకిస్తాన్తో సిరీస్ ఆడేందుకు ఇష్టపడడం లేదని పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. ‘ఇండియా- పాకిస్తాన్ జట్ల మధ్య మంచి గౌరవం, స్నేహం గతంలో ఉండేవి.. కానీ ఇప్పుడున్న టీముల్లో భారత జట్టు ఒక్కటే, పాకిస్తాన్తో సిరీస్లు ఆడడం లేదు.. వాళ్లు ఎందుకు ఆడడం లేదో తెలుసా.. పాక్ జట్టు పటిష్టంగా ఉంది.. ఒకవేళ ఆడితే ఓడిపోతామనే భయంతోనే మ్యాచ్ లు ఆడటం లేదని రజాక్ చెప్పాడు. ఇంతకు ముందు కూడా మాతో ఇండియా మ్యాచులు ఆడినప్పుడల్లా ఓడిపోయేవాళ్లు అంటూ వ్యాఖ్యనించాడు.
Read Also: Godavari River : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల అద్దం పడుతున్న గోదావరి
ఇప్పుడు పరిస్థితి మారింది.. 2023లో ఉన్నాం.. ఇప్పటికైనా బీసీసీఐ ఆలోచనలు మార్చుకుంటే మంచిది అని అబ్దుల్ రజాక్ అన్నాడు. ఇప్పుడు చిన్న టీమ్ లేదు, పెద్ద టీమ్ లేదు.. ఆ రోజు ఏ టీమ్ బాగా ఆడితే అదే గెలుస్తుంది.. భారత జట్టు కూడా పాక్ టీమ్లాగే పటిష్టంగా ఉంది.. యాషెస్ సిరీస్లో ఏ జట్టు బలమైనదో చెప్పగలమా? అలాగే ఇండియా, పాకిస్తాన్లలో ఏ టీమ్ బలమైనదో చెప్పలేం అని అతడు తెలిపాడు.
Read Also: Minister Vidadala Rajini: మంత్రి విడదల రజనీకి అస్వస్థత.. వెంటనే బెజవాడకు..
ఇరు జట్ల మధ్య సంబంధాలు మెరుగు అవ్వాలంటే వరుసగా టీ20, టెస్టు, వన్డే సిరీస్లు జరగాలి అని పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అన్నారు. అందుకు బీసీసీఐ ముందుకు వస్తే బాగుంటుంది.. అంటూ ఆయన కామెంట్ చేశాడు. జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి చిన్న టీమ్స్తో గెలవడానికి కూడా అపసోపాలు పడే పాక్ జట్టుతో ఆడేందుకు టీమిండియా ఎందుకు భయపడుతుందని అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు… భలే కామెడీగా ఉన్నాయని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..