Teachers Unions: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లపై సంతకాలు చేస్తే తప్పేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఉపాధ్యాయులపై సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబట్టాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్సతో ముగిసిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. సమావేశం అనంతరం APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాట్లాడారు. రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న ఉపాధ్యాయులపట్ల అధికారులు అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనడం ఉపాధ్యాయులకు ఉన్న హక్కు. అభ్యర్ధులు ఎవరైనా వారి తరుపున పోటీ చేస్తే నామినేషన్ పత్రాల్లో ఉపాధ్యాయులు సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ నామినేషన్ లో ఉపాధ్యాయులు పాల్గొనే వెసులుబాటును రాజ్యాంగం కల్పించిందన్నారు.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్
Also Read
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
- TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!
ఈ విషయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నామినేషన్ పత్రాల్లో సంతకాలు పెట్టారని షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటి ? మంత్రి బొత్స దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లామన్నారు చిరంజీవి. రాజకీయ పరమైన అంశాలను అధికారులే ఉపాధ్యాయుల మధ్యకు తీసుకురావడం సరికాదన్నారు. సెమిస్టర్ విధానం వల్ల విద్యార్థులకు సక్రమంగా పుస్తకాలు అందలేదని మంత్రికి చెప్పాం అన్నారు. వచ్చే ఏడాది నుంచి రెండు సెమిస్టర్లు మాత్రమే అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి తెలిపారు.
తాజావార్తలు
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
-
Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?
-
Mango Sharbat : ఎండవేడిని తరిమికొట్టే ‘మామిడి పండ్ల షర్బత్’.. ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి.!