Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత
- కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు
- గో బ్యాక్ క్రాంతి అంటూ ముద్రగడ అనుచరుల నినాదాలు
- తండ్రి కడసారి చూపుకోసం వచ్చిన కూతురు క్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభంకు కడసారి నివాళులు అర్పించేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని పోలీసులు, ముద్రగడ అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ‘గో బ్యాక్ క్రాంతి’ అంటూ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో.. అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ, క్రాంతి మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలు నెలకొన్నాయి. ఆ విభేదాల ప్రభావంతోనే ఇప్పుడు కిర్లంపూడిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
తండ్రి ముద్రగడ పద్మనాభంకు నివాళులు అర్పించేందుకు కిర్లంపూడికి బయలుదేరిన క్రాంతిని మొదట ప్రత్తిపాడు వద్ద పోలీసులు ఆపేశారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకే ఆమెను అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. గతంలో తనకు, కుమార్తెకు మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో తాను మరణిస్తే క్రాంతి రావద్దని ముద్రగడ చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే తండ్రిని చివరిసారైనా చూసేందుకు అనుమతించాలని క్రాంతి భావోద్వేగంతో పోలీసులను వేడుకుంది. ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. నివాళులు అర్పించేందుకు పరిమిత అనుమతి ఇచ్చారు. నివాళులు అర్పించిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
Also Read
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ముద్రగడ నివాసం వద్దకు చేరుకున్న క్రాంతిని ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. ‘గో బ్యాక్ క్రాంతి’ అంటూ నినాదాలు చేశారు. కొందరు అనుచరులు ముద్రగడ మరణానికి క్రాంతే కారణమంటూ ఆరోపణలు చేస్తూ నినాదాలు చేయడంతో.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల మధ్య భావోద్వేగానికి గురైన క్రాంతి.. తన తండ్రిని ఒక్కసారి చూడనివ్వాలని కన్నీటి పర్యంతమైంది. అనంతరం పోలీసుల భద్రత మధ్య ఆమె ముద్రగడ పద్మనాభంకు నివాళులు అర్పించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి.. నివాళుల అనంతరం క్రాంతిని అక్కడి నుంచి తరలించారు.
తాజావార్తలు
-
Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
-
YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!