Laxmi Parvathi: టీడీపీని నందమూరి ఫ్యామిలీకి అప్పగించాలి.. జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్కు పగ్గాలు ఇవ్వాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laxmi Parvathi: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్పై మరోసారి మండిపడ్డారు తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు హయాంలో సెల్ఫ్ డబ్బా తప్ప.. అభివృద్ది శూన్యం.. ఎన్నో కష్టాలు పడిన వైఎస్ జగన్ కు రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని తెలిపారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ధనవంతుడు అయ్యాడే తప్ప.. నిరుపేదలు అలాగే ఉన్నారని విమర్శించిన ఆమె.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. పుత్రుడు, దత్త పుత్రుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా.. ప్రజలు నమ్మరు.. ఎన్టీఆర్ మనవడుగా లోకేష్ ను ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదు.. వాళ్లిద్దరికీ నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఇక, టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేసిన లక్ష్మీపార్వతి.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని సూచించారు.
Read Also: Fire Accident: వామ్మో.. ఎక్కడి మంటలు.. గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైదాకా నిప్పుల కుంపటే
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
చంద్రబాబు నాయడు ఇసుక మీద 4 వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని ఆరోపించారు లక్ష్మీపార్వతి.. చంద్రబాబు సైకో, శాడిస్ట్ కాబట్టే.. ప్రశ్నించే వారిని గుర్రాలతో తొక్కించారు.. తహశీల్దార్ వనజాక్షిని బెదిరించారని విరుచుకుపడ్డారు. ఇక, లోకేష్ అయోమయంలో మాట్లాడుతున్నారు.. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వైసీపీ హయాంలో జరిగినట్లు విమర్శలు చేస్తున్నారని.. అధికారంలోకి రాక ముందే దత్త పుత్రుడు, సొంత పుత్రుడు చంపుతా, నరుకుతా, బట్టలు విప్పి కొడతా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పనికి మాలిన లోకేష్ కోసం కోట్లు ఖర్చు పెట్టి భాష నేర్పించాడు.. అయినా అతనిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు.. ఇప్పటికైనా టీడీపీని నందమూరి ఫ్యామిలీకి అప్పగించాలి.. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించాలని సూఇంచారు.. 2019లోనే చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయ్యిందని వ్యాఖ్యానించిన ఆమె.. సినిమాలు చేసుకుంటున్న పవన్ ను తీసుకొచ్చి.. కాపు నాయకుల్ని తిట్టిస్తున్నాడని ఆరోపించారు.. విష వృక్షం నీడలో రాజకీయాలు చెయ్యొద్దని గతంలో పవన్ కల్యాణ్కి చెప్పానని గుర్తుచేసుకున్నారు లక్ష్మీపార్వతి.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!