Tdp Support Venkayamma: వెంకాయమ్మకు టీడీపీ అండ.. వైసీపీ దాడిపై ఖండన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందని ఒకవైపు విపక్ష టీడీపీ విమర్శలు చేస్తోంది. మరోవైపు వైసీపీ పాలన బాగాలేదని ఎవరైనా సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తే ఆ పార్టీనేతలు దాడులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా వెంకాయమ్మ ఘటన ఏపీలో సంచలనం కలిగిస్తోంది. ప్రభుత్వ పనితీరు బాగోలేదని చెప్పినందుకు తన ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చింది ఎస్సీ మహిళ వెంకాయమ్మ.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన వెంకాయమ్మ వీడియో నిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత రాత్రి వెంకాయమ్మ ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. పార్టీ కార్యాలయానికి వచ్చిన వెంకాయమ్మను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, శ్రావణ్ తదితరులు.
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
బాధిత మహిళ వెంకాయమ్మ మాట్లాడుతూ.. స్పందన కార్యక్రమంలో మీడియా అడిగిన వాటికి వాస్తవాలే మాట్లాడానన్నారు. ఇందుకు వైసీపీ నేతలు నా ఇంటికి వచ్చి నా గొంతు నొక్కి, జాకెట్ చించి దాడికి పాల్పడ్డారు. టీబీ వ్యాధితో బాధపడుతున్న నాపై కనీస కనికరం చూపలేదు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. వాస్తవ పరిస్థితులు వెంకాయమ్మ చెప్తే.. జీర్ణించుకోలేకే వెంకాయమ్మపై పథకం ప్రకారం దాడి చేశారు. గొంతెత్తి మాట్లాడితే బతికే స్వేచ్ఛ రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు నక్కా ఆనందబాబు.
పథకం ప్రకారమే రాష్ట్రంలో దళితులపై వరుస దాడులు చేయిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఈ ఘటనపై మండిపడ్డారు. వెంకాయమ్మ పేదరికంలో ఉన్నా నీతిగా నిర్భయంగా మాట్లాడింది.బడుగులను భయపెట్టి గొంతు నొక్కాలని చూస్తే వదిలిపెట్టం అన్నారు. వెంకాయమ్మ విషయంలో ఏం చేస్తారో మహిళా కమిషన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!