Yemmiganur: పద్మ శ్రీ మాచాని సోమప్ప ఆశయాలు డా. మాచాని సోమనాథ్ తోనే సాధ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎందరో జీవితాలకు వెలుగునిచ్చి ఎమ్మిగనూరు ప్రాంత ప్రజల గుండెల్లో… చిరస్మరణీయుడుగా నిలిచిన మహనీయుడు, చేనేతల పితామహుడు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప. ఆయన ఆశయాలు నిరంతరం కొనసాగాలంటే.. అది కేవలం ఎం.జి. కుటుంబ వారసుడు డాక్టర్ మాచాని సోమనాథ్ తోనే సాధ్యమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పద్మశ్రీ మాచాని సోమప్ప బంగ్లాలో ఏర్పాటైన సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. పరిశ్రమలను స్థాపించి, చేనేతల పితామహుడుగా పేరుగాంచి 1954 లో భారత రాష్ట్రపతి చేత పద్మశ్రీ జాతీయ అవార్డు అందుకుని ఎమ్మిగనూరు ప్రాంతాన్ని రాజకీయంగా, సామాజికంగా, పారిశ్రామికంగా జాతీయ చిత్రపటంలో ఇనుమడింపజేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
Ghobi Manchuria : గోబీని ఇష్టంగా లాగిస్తున్నారా?.. ఇది వింటే షాక్ అవుతారు..
Also Read
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
ఎమ్మిగనూరు ప్రాంతంలో పేద వర్గాలను, నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా 1) ది ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్, 2) ది ఎమ్మిగనూర్ కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్, 3) ది ఎమ్మిగనూరు కో- ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ 4) ది ఎమ్మిగనూరు లెదర్ వర్కర్స్ కో- ఆపరేటివ్ కాటేజ్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్, 5) ది ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ మిల్క్ సప్లై సొసైటీ, ది ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ, 6) ది ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (వై.డబ్ల్యు.సి.యస్.) స్థాపించారని గుర్తు చేశారు. చేనేతలు మగ్గాలు నేసేందుకు విస్తారంగా ఉండేలా రూపకల్పన చేసి వందల మంది చేనేత కార్మికులకు 0.11 సెంట్లు ప్రకారం స్థలమును మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించి వీ వర్స్ కాలనీ రూపొందించడమే కాకుండా ఎమ్మిగనూరు నియోజకవర్గంతో పాటు చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేలా విలువైన స్థలాలను దానం చేసి పాఠశాలలు, వైద్యశాలలు నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రిని కలిసిన హను-మాన్!
మహనీయుడైన పద్మశ్రీ మాచాని సోమప్ప స్ఫూర్తితో.. వారి వంశానికి చెందిన నాలుగవ తరం (ముని మనవడు) మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ యం.యస్.శివన్న మనువడు అయిన డాక్టర్ మాచాని సోమనాథ్ ప్రజా సేవలో కొనసాగడానికి, పద్మశ్రీ మాచని సోమప్ప స్పూర్తితో ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. స్థానికుడు, నీతివంతమైన పాలన అందించడానికి విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి ఎం.జి. కుటుంబ వారసుడైన డాక్టర్ మాచాని సోమనాథ్ ను చేనేతలతోపాటు, అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని కోరారు. ఎమ్మిగనూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో.. పద్మశ్రీ మాచాని సోమప్ప, ఆయన తనయుడు యం.యస్. శివన్నల పాత్ర ఎంతో ఉందన్నారు. నేడు కొందరు రాజకీయాలను వ్యాపారంగా మార్చుకున్న స్థానికేతరులు మహనీయుడైన, చేనేతల పితామహుడు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్పను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమన్నారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు హాయంలో ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో 91.31 ఎకరముల భూమిని “టెక్స్ టైల్” పార్కు కోసం కేటాయిస్తే..! దానిని రద్దుపరిచి ఇతర జిల్లాలకు తరలించి, చేనేతలను మోసం చేసిన వారే నేడు “చేనేత బాంధవ్యుల ఆత్మీయ సమ్మేళనం” పేరుతో మీటింగ్ ఏర్పాటు చేయడం మరోసారి మోసం చేయడమేనని, దీనిని చేనేతలు నమ్మరని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!