Machani Somnath: చేనేతలపై కపట ప్రేమలను మానుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Machani Somnath: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత మాచాని సోమనాథ్. మాచాని సోమప్ప ఎక్కడైతే అభివృద్ధిని వదిలేసారో.. వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తానని, చేనేత అభివృద్ధికి పాటుపడుతానని ఇటీవల చేనేత ఆత్మీయ సమ్మేళన సభలో బుట్టా రేణుక చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. బుట్టా రేణుక నాగలదిన్నె గ్రామాన్ని తాను ఎంపీగా ఉన్నపుడు దత్తత తీసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అక్కడ నాగలదిన్నెలో ఉన్న చేనేత ప్రజలకు తాను చేసింది ఏమీ లేదని మాచాని సోమనాథ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు మాత్రం ఎమ్మిగనూరు నియోజకవర్గ చేనేత ప్రజలకు ఏదో చేస్తారని అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.
Read ALso: TDP 2nd List: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా.. చంద్రబాబు కీలక ప్రకటన
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ కింద అప్పట్లో మాచాని సోమప్ప ఒక మైదానాన్ని కేటాయించి క్రీడాస్థలంగానూ, ఎగ్జిబిషన్కు గానూ ఉపయోగించుకోవాలనే మంచి ఉద్దేశంతో మొదలుపెడితే దాన్ని వైసీపీ నాయకులు తమ సొంత ధనార్జన కొరకు దుకాణాలు పెట్టించి వైడబ్ల్యూసీఎస్కు తీరని అన్యాయాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. సోమప్ప ఆశయాలకి వ్యతిరేకంగా ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ప్రభుత్వ నాయకులకు తెలియదా అంటూ ప్రశ్నించారు. టీడీపీ ఆధ్వర్యంలో బనవాసిలో టెక్స్టైల్ పార్కు కొరకు స్థలాన్ని కేటాయిస్తే అప్పట్లో వేసిన శంకుస్థాపన, శిలాఫలకం తప్ప అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. చేనేతలకు ఇచ్చే పింఛన్లను చేనేతలు కానీ వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారనేది నిజమా కాదా అంటూ ప్రశ్నించారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కో-ఆపరేషన్ కొరకు వైడబ్ల్యూసీఎస్ కింద స్థలాన్ని కేటాయిస్తే ఇప్పుడు అక్కడ చేనేతలకు ఉపయోగపడే ఎటువంటి సహాయ సహకారాలు జరగడం లేదన్నారు. ఇది వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆయన విమర్శించారు. దీని గురించి బుట్టా రేణుక గారు ఏమి మాట్లాడకపోవడం గమనార్హమన్నారు.
2009, 2011 వరదల సమయంలో మాచాని సోమప్ప ఫౌండేషన్ కింద పేదలకు సహాయం చేశామన్నారు. Indi-village Tech Solutions pvt ltd ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, తాగునీటి వసతులు కల్పించడం జరుగుతూనే ఉందన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్నది మాచాని సోమప్ప ఫౌండేషన్ కింద మేమందరం చేస్తున్న సేవలు మీకు కనపడటం లేదా అని వైసీపీ నాయకులను ఉద్దేశించి మాచాని సోమనాథ్ అన్నారు. కాబట్టి ఇప్పటికైనా చేనేతపై ముసలి కన్నీళ్ళు కార్చడం ఆపాలని మాచాని సోమనాథ్ తెలియజేశారు,
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!