B.V. Raghavulu: మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. 370 సీట్లు గెలుస్తాం అని బీజేపీ స్పష్టంగా చెప్తోంది… జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ కాబట్టి బీజేపీ అలా అంటుందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ను విభజించి ముక్కలు చేశామని బీజేపీ గొప్పగా చెప్పుకుంటుంది.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, విదేశీ సంస్థలకు దేశాన్ని అమ్మడం గొప్ప విజయంగా బీజేపీ భావిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఖూనీ చెయ్యడం కూడా గొప్ప విజయమే అంటుందని విమర్శించారు. 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి గేంటేసి, 19 బిల్లులను బీజేపీ ఆమోదం తెలిపిందని అన్నారు.
Mohammed Shami: గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్.. ఐపీఎల్ 2024కు షమీ దూరం
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును అరించివేసింది బీజేపీనని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛను ఇప్పటికే అణిచివేస్తున్నారు.. కొత్తగా మరో యాక్ట్ తెస్తున్నారని అన్నారు. ఎలక్షన్ కమిషన్ లో చాలా లోపాలు ఉన్నాయి… ఈసీ స్వయంప్రతిపత్తిని తీసివేసే కుట్ర చేస్తున్నారని బీవీ రాఘవులు మండిపడ్డారు. బీజేపీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఒక నాటకం అయింది.. ఎన్నికల ఖర్చు తగ్గించాలని హిట్లర్ చెప్పిన మాటలను బీజేపీ ఆచరణలో అమలు చేసే కుట్ర చేస్తోందని అన్నారు. నిరంకుశ, నియంత, అధ్యక్ష తరహా పాలన జరిపేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
Madhya Pradesh: స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు లింగమార్పిడి ఆపరేషన్.. తర్వాత ఏమైందంటే..!
ప్రపంచం అంతా తిరిగి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు.. వన్ ఎలక్షన్ ను అంబేద్కర్ వ్యతిరేకించారని అన్నారు. అమెరికా లాంటి దేశంలో సమాఖ్య స్ఫూర్తి ఉంది అందుకే అభివృద్ధిలో ముందుందని బీవీ రాఘవులు తెలిపారు. ప్రస్తుతం దేశాన్ని, ప్రజాస్వామ్యన్ని డబ్బు శాసిస్తుంది.. ఎన్నికల బాండ్స్ ను ఆనాడే సీపీఎం వ్యతిరేకించింది.. ఇపుడు సుప్రీంకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ కు తాము వ్యతిరేకం… సీపీఎం ఇప్పటికీ బాండ్స్ తీసుకోలేదని చెప్పారు. దేశాన్ని ఎలక్షన్ బజార్ గా చేసింది బీజేపీనని దుయ్యబట్టారు.
- Tags
- bjp
- bv raghavulu
- CPM
- modi
- Politics
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!