Chandrababu: మోడీపై బాబు ప్రశంసలు.. ఆయన లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: పార్లమెంట్ భవనంలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతలు, బీజేపీ, ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశంలో.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎన్డీఏ కూటమి, బీజేపీ ఎంపీల సమావేశంలో టీడీపీ, జేడీఎస్, ఎన్సీపీ, జనసేన, అప్నాదళ్ ఎంపీలు, నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్గా మారిపోయిందన్నారు. నా రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను చూశాను.. కానీ, నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదన్నారు.. మేకిన్ ఇండియా, విజినరీతో మోడీ.. దేశానికి అద్భుత విజయాలు అందించారని ప్రశంసలు కురిపించారు.. అంతర్జాతీయ స్థాయిలోనూ మోడీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు.. మోడీ విజన్, సమర్థత దేశానికి ఎంతో అవసరం.. మోడీ సేవలు దేశానికి చాలా అవవసరం అన్నారు. భారత్కు సరైన సమయంలో సరైన నాయకుడు దొరకాడంటూ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకోవాలని సూచించారు. మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే ఐదో ఆర్థికశాఖగా ఎదిగింది.. ఈ ఐదేళ్లలో ప్రపంచంలోనే రెండో లేదా మూడో ఆర్థిక శక్తిగా మారబోతోందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు చంద్రబాబు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరు
Also Read
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
దేశంలో ఉన్న యువశక్తి ఐటీ రంగంలో దూసుకుపోతోందన్నారు చంద్రబాబు.. ఇక, ఎన్డీఏతో ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు.. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ప్రజలకు ఎంతో సేవ చేశారు.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎంతో విజన్తో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మేం నరేంద్ర మోడీని ప్రతిపాదిస్తున్నాం అని ప్రకటించారు. మరోవైపు.. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 95 శాతం సీట్లు గెలిచామని వెల్లడించారు.. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా పనిచేసి ఈ విజయం సాధించాయన్నారు.. నా జీవితంలో ఇలాంటి ఫలితాలను చూడలేదని పేర్కొన్నారు.. ఎన్నికల్లో విజయం వెనుక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్ర అమోగం అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి అంతా పనిచేశామని పేర్కొన్నారు. ఇక, ఎన్డీఏ కూటమి సమావేశంలో చంద్రబాబు నాయుడు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
-
PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
-
OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
-
YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!