Chandrababu: వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో ఈజీగా గెలవబోతున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు అని.. టీడీపీలో చేరుతున్నారంటే జిల్లాలో ఎంతో ఉత్సాహం కనబడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో ఈజీగా గెలవబోతున్నామని ఆయన అన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలని టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి దంపతులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాలు, వ్యాపారం కాకుండా.. సేవ కోసం వేమిరెడ్డి వచ్చారని.. నెల్లూరులో వైసీపీ అంతా ఖాళీ అవుతోందన్నారు. నెల్లూరు ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఉన్నారన్నారు. సాధారణంగా ఎవరైనా పార్టీలో చేరాలంటే హైదరాబాద్ లేదా అమరావతికి వస్తారని.. కానీ నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించానంటే అదే వారికి ఇచ్చిన ప్రత్యేకత అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. నెల్లూరు రాజకీయ నాయకులు ఆత్మాభిమానంతో ఉంటారన్నారు.
Read Also: Vijayasai Reddy: 100 ఎకరాల్లో 15 లక్షల మంది పాల్గొనేలా మేదరమెట్ల ‘సిద్ధం’ మహాసభ
Also Read
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
- Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
- CM Vijay: సింహాసనం విజయ్ది.. వ్యూహం కాంగ్రెస్ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..!
చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రజలను బానిసలుగా జగన్ భావిస్తున్నారు. చేసిన తప్పులు ఎత్తి చూపితే జగన్ తట్టుకోలేరు అందుకే ఆనం, కోటంరెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డిలు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. టీడీపీలో వ్యక్తులను గౌరవిస్తాం. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలి. జగన్ విధానాలు నచ్చక ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బయటకు వస్తున్నారు. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే. జగన్ మాటలు అన్నీ బూటకమే.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత విశాఖను దోచిన వ్యక్తిని నెల్లూరుకి పంపుతున్నారు. ఆయనను నెల్లూరు ప్రజలు తిరుగు టపాలో పంపుతారు.” అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Mudragada Padmanabham: ముద్రగడ కుమారుడితో రాజకీయ అంశాలపై వైసీపీ నేతల చర్చ!
నెల్లూరులో ఒక నేత ఎగిరి ఎగిరి పడ్డారని.. ఆయన మంత్రిగా ఉన్నపుడు ఒంటి మీద బట్టలు కూడా సరిగా వేసుకోడని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. వై నాట్ కుప్పం అన్నారని.. తాము వై నాట్ పులివెందుల అంటున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు ఎంతో బాధ కలుగుతోందన్నారు. ఒక్క చాన్స్ పేరుతో వచ్చి అన్ని వర్గాల ప్రజలనూ జగన్ ఇబ్బంది పెడుతున్నారన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. “ఉద్యోగులు జీతాలు పెంచమని అడగడం లేదు. జీతం వస్తే చాలను కుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. నెల్లూరులో పదికి పది స్థానాలు గెలిపించాలి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశా. వేమిరెడ్డిపై కూడా సర్వే చేస్తే చక్కటి స్పందన వచ్చింది. జనసేన-టీడీపీలు 99 మంది అభ్యర్థులను ప్రకటిస్తే వైసీపీలో వణుకు పుడుతోంది.” అని అన్నారు.
తాజావార్తలు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
-
Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
-
K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
-
OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?